ETV Bharat / city

హోరాహోరీగా సహారా స్టేట్స్​ ఎన్నికలు.. కరణం శ్రీకాంత్​ ప్యానెల్​ ఘన విజయం

author img

By

Published : May 22, 2022, 8:34 PM IST

Updated : May 23, 2022, 7:17 AM IST

Karan Srikanth panel win in Sahara Estates Maintenance Welfare Society hyderabad Elections
Karan Srikanth panel win in Sahara Estates Maintenance Welfare Society hyderabad Elections

19:49 May 22

హోరాహోరీగా సహారా స్టేట్స్​ ఎన్నికలు.. కరణం శ్రీకాంత్​ ప్యానెల్​ ఘన విజయం

ఎల్బీనగర్​లోని సహారా స్టేట్స్ గేటెడ్ కమ్యూనిటీ కార్యవర్గానికి ఆదివారం ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎన్నికల్లో కరణం శ్రీకాంత్‌ ప్యానెల్‌ ఘన విజయం సాధించింది. సొసైటీ అధ్యక్షుడిగా కరణం శ్రీకాంత్‌ ఘన విజయం సాధించారు. ఉదయం నుంచి ప్రారంభమైన ఎన్నికల్లో గేటెడ్ కమ్యునిటీ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇరువర్గాలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి.

సాయంత్రం జరిగిన ఓట్ల లెక్కింపులో కరణం శ్రీకాంత్‌ ప్యానెల్‌ ఘన విజయం సాధించింది. కాగా.. ఉపాధ్యక్షుడిగా రేణుకుంట్ల రాఘవేందర్, జనరల్‌ సెక్రటరీగా పార్థసారథి, ట్రెజరర్‌గా పి.జగత్ రెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పి.నర్సింహ గౌడ్, బి.మంగమ్మ, బి.మంజుల, వెంకటేశ్వర్ రావు, బి.సింహాద్రి, జి.అనంత్ రెడ్డి, మంజుల రెడ్డి, వెంకట్ రెడ్డి, రత్నమాల, టి.శ్రీనాథ్ సూరి, శ్రీనయ్య, జి.విజయలక్ష్మి, కృష్ణారావు, ఎం.రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. మొత్తం కార్యవర్గంలో 7మంది శ్రీకాంత్ ప్యానల్, ఆరుగురు వెంకటాద్రి ప్యానల్​కు చెందిన వారు ఉన్నారు. ఫలితాల ప్రకటన అనంతరం.. గెలుపొందిన ప్యానెల్​ సభ్యులు సంబురాలు చేసుకున్నారు.

ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతామని నూతన అధ్యక్షుడు కరణం శ్రీకాంత్​ తెలిపారు. సొసైటీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. ఎస్టేట్స్​ సభ్యులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి.. సమస్యలు సత్వరమే పరిష్కరామయ్యేలా చొరవచూపుతామని ఎన్నికైన ప్యానెల్​ హామీ ఇచ్చింది.

ఇవీ చూడండి:

19:49 May 22

హోరాహోరీగా సహారా స్టేట్స్​ ఎన్నికలు.. కరణం శ్రీకాంత్​ ప్యానెల్​ ఘన విజయం

ఎల్బీనగర్​లోని సహారా స్టేట్స్ గేటెడ్ కమ్యూనిటీ కార్యవర్గానికి ఆదివారం ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎన్నికల్లో కరణం శ్రీకాంత్‌ ప్యానెల్‌ ఘన విజయం సాధించింది. సొసైటీ అధ్యక్షుడిగా కరణం శ్రీకాంత్‌ ఘన విజయం సాధించారు. ఉదయం నుంచి ప్రారంభమైన ఎన్నికల్లో గేటెడ్ కమ్యునిటీ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇరువర్గాలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి.

సాయంత్రం జరిగిన ఓట్ల లెక్కింపులో కరణం శ్రీకాంత్‌ ప్యానెల్‌ ఘన విజయం సాధించింది. కాగా.. ఉపాధ్యక్షుడిగా రేణుకుంట్ల రాఘవేందర్, జనరల్‌ సెక్రటరీగా పార్థసారథి, ట్రెజరర్‌గా పి.జగత్ రెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పి.నర్సింహ గౌడ్, బి.మంగమ్మ, బి.మంజుల, వెంకటేశ్వర్ రావు, బి.సింహాద్రి, జి.అనంత్ రెడ్డి, మంజుల రెడ్డి, వెంకట్ రెడ్డి, రత్నమాల, టి.శ్రీనాథ్ సూరి, శ్రీనయ్య, జి.విజయలక్ష్మి, కృష్ణారావు, ఎం.రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. మొత్తం కార్యవర్గంలో 7మంది శ్రీకాంత్ ప్యానల్, ఆరుగురు వెంకటాద్రి ప్యానల్​కు చెందిన వారు ఉన్నారు. ఫలితాల ప్రకటన అనంతరం.. గెలుపొందిన ప్యానెల్​ సభ్యులు సంబురాలు చేసుకున్నారు.

ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతామని నూతన అధ్యక్షుడు కరణం శ్రీకాంత్​ తెలిపారు. సొసైటీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. ఎస్టేట్స్​ సభ్యులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి.. సమస్యలు సత్వరమే పరిష్కరామయ్యేలా చొరవచూపుతామని ఎన్నికైన ప్యానెల్​ హామీ ఇచ్చింది.

ఇవీ చూడండి:

Last Updated : May 23, 2022, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.