ETV Bharat / city

ఈ కల్పన ఇంట్లో నీటి కరవు లేనే లేదు

‍    భాగ్యనగరమంతా కృష్ణ, గోదావరి నీళ్లు తాగుతుంటే... ఈ కుటుంబం మాత్రం 8 ఏళ్లుగా వాటికి దూరంగా ఉంటోంది. ప్రతివర్షపు బొట్టును ఒడిసి పడుతూ కాంక్రిట్ జంగిల్​గా మారిన ఐటీ కారిడార్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తోంది. ఒక్కవాన బొట్టు వృథాగా పోయినా... భావితరాల నుంచి నీటిని లాక్కున్నట్లే అని భావిస్తోంది. ఊరంతా నీటి కోసం తండ్లాడుతుంటే.. వీరు మాత్రం గత ఎనిమిదేళ్లుగా నీటి సమస్య అనేది తెలియకుండా హాయిగా ఉన్నారు.

author img

By

Published : Jul 18, 2019, 5:44 PM IST

Updated : Jul 19, 2019, 12:05 PM IST

kalpana and ramesh couplein hyderabad saving each and every rain drop and recycling used water
ఈ కల్పన ఇంట్లో నీటి కరవు లేనే లేదు

హైదరాబాద్ గచ్చిబౌలి ఐటీ కారిడార్​లో భూగర్భజలాలు పాతాళానికి పడిపోవడం వల్ల ఇక్కడి ప్రజలంతా నీటి ట్యాంకర్ల పైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ రోలింగ్​ హిల్స్​ కాలనీలో నివాసం ఉన్న కల్పన రమేష్ కుటుంబం మాత్రం చుక్కనీరు కూడా బయటి నుంచి తెచ్చుకోకపోవడం విశేషం. తమ ఇంటిపై కురిసిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి నిత్యావసరాలు తీర్చుకుంటున్నారు. ఎనిమిదేళ్లుగా వాన నీటినే వినియోగిస్తూ నీటి ఆవశ్యకతను చాటిచెబుతున్నారు.

ప్రతి చినుకు... ఉపయోగించేలా

ఇంటి నిర్మాణ సమయంలోనే నీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కల్పన రమేశ్​ దంపతులు నిర్ణయించారు. బోరుబావి తవ్వకుండా... తమ ఇంటిపై కురిసే ప్రతివర్షపు చినుకును ఒడిసిపట్టి వినియోగించుకునేలా నిర్మాణం చేపట్టారు. 6 ఇంకుడు గుంతలు, 30 వేల లీటర్ల సామర్థ్యంతో సంపు ఏర్పాటు చేసుకున్నారు. ఇంటిపై కురిసే ప్రతి వర్షపు చినుకును వాటిలోకి మళ్లేలా పైపులైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.

వాడిన నీటి రీసైక్లింగ్

అధిక వర్షం కురిసినప్పుడు నీరు వృథా కాకుండా సంపులో ఎక్కువైన నీరంతా ఇంకుడు గుంతలోకి వెళ్తోంది. వంట గది, స్నానాల గదిలో ఉపయోగించిన నీళ్లు కూడా రీసైక్లింగ్ ద్వారా ఇంటిముందున్న మొక్కలకు 365 రోజులు అందేలా నీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంటి ఆవరణలో రకరకాల పండ్లు, పూలమొక్కలతోపాటు డాబాపై ఆకుకూరలు, ఔషధ మొక్కలను పెంచుకుంటూ ఇంటి పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకున్నారు.

40 ఇంకుడు గుంతలు, 14 ఇంజెక్షన్​ బోర్​వెల్స్

కల్పన రమేశ్​ దంపతులు తమ ఇంట్లోనే కాక కాలనీలోనూ వరద నీటిని భూమిలోకి ఇంకిస్తున్నారు. నీరు నిలిచే ప్రాంతాల్లో ఇప్పటికే 40 ఇంకుడు గుంతలు, 14 ఇంజెక్షన్ బోర్ వెల్స్ ను ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్లుగా రోలింగ్ హిల్స్ కాలనీలో నీటి ట్యాంకర్ల వాడకం పూర్తిగా తగ్గింది. మొత్తం 90 కుటుంబాలు నీటి ట్యాంకర్లను దూరంపెట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు.

ఏడాదికి లక్ష రూపాయలు ఆదా

వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా ఏడాదికి ఒక్కో కుటుంబం లక్ష రూపాయలు ఆదా చేయవచ్చని కల్పన రమేష్ చెబుతున్నారు. నీటి నిర్వహణపై మహిళలు దృష్టిసారిస్తే భావితరాలకు చక్కటి ఆరోగ్యాన్నే కాకుండా... ప్రభుత్వాలపై భారం కూడా తగ్గించవచ్చని సూచిస్తున్నారు. నీటిని పొదుపు చేయడం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని కోరుతున్నారు. నీటి వృథాపై ప్రజలను చైతన్యపరిస్తూ ఐటీ కారిడార్​లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కల్పన రమేశ్​ దంపతులు.

ఇదీ చూడండి : నీటి కోసం బస్తీవాసుల భగీరథ యత్నం

ఈ కల్పన ఇంట్లో నీటి కరవు లేనే లేదు

హైదరాబాద్ గచ్చిబౌలి ఐటీ కారిడార్​లో భూగర్భజలాలు పాతాళానికి పడిపోవడం వల్ల ఇక్కడి ప్రజలంతా నీటి ట్యాంకర్ల పైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ రోలింగ్​ హిల్స్​ కాలనీలో నివాసం ఉన్న కల్పన రమేష్ కుటుంబం మాత్రం చుక్కనీరు కూడా బయటి నుంచి తెచ్చుకోకపోవడం విశేషం. తమ ఇంటిపై కురిసిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి నిత్యావసరాలు తీర్చుకుంటున్నారు. ఎనిమిదేళ్లుగా వాన నీటినే వినియోగిస్తూ నీటి ఆవశ్యకతను చాటిచెబుతున్నారు.

ప్రతి చినుకు... ఉపయోగించేలా

ఇంటి నిర్మాణ సమయంలోనే నీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కల్పన రమేశ్​ దంపతులు నిర్ణయించారు. బోరుబావి తవ్వకుండా... తమ ఇంటిపై కురిసే ప్రతివర్షపు చినుకును ఒడిసిపట్టి వినియోగించుకునేలా నిర్మాణం చేపట్టారు. 6 ఇంకుడు గుంతలు, 30 వేల లీటర్ల సామర్థ్యంతో సంపు ఏర్పాటు చేసుకున్నారు. ఇంటిపై కురిసే ప్రతి వర్షపు చినుకును వాటిలోకి మళ్లేలా పైపులైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.

వాడిన నీటి రీసైక్లింగ్

అధిక వర్షం కురిసినప్పుడు నీరు వృథా కాకుండా సంపులో ఎక్కువైన నీరంతా ఇంకుడు గుంతలోకి వెళ్తోంది. వంట గది, స్నానాల గదిలో ఉపయోగించిన నీళ్లు కూడా రీసైక్లింగ్ ద్వారా ఇంటిముందున్న మొక్కలకు 365 రోజులు అందేలా నీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంటి ఆవరణలో రకరకాల పండ్లు, పూలమొక్కలతోపాటు డాబాపై ఆకుకూరలు, ఔషధ మొక్కలను పెంచుకుంటూ ఇంటి పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకున్నారు.

40 ఇంకుడు గుంతలు, 14 ఇంజెక్షన్​ బోర్​వెల్స్

కల్పన రమేశ్​ దంపతులు తమ ఇంట్లోనే కాక కాలనీలోనూ వరద నీటిని భూమిలోకి ఇంకిస్తున్నారు. నీరు నిలిచే ప్రాంతాల్లో ఇప్పటికే 40 ఇంకుడు గుంతలు, 14 ఇంజెక్షన్ బోర్ వెల్స్ ను ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్లుగా రోలింగ్ హిల్స్ కాలనీలో నీటి ట్యాంకర్ల వాడకం పూర్తిగా తగ్గింది. మొత్తం 90 కుటుంబాలు నీటి ట్యాంకర్లను దూరంపెట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు.

ఏడాదికి లక్ష రూపాయలు ఆదా

వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా ఏడాదికి ఒక్కో కుటుంబం లక్ష రూపాయలు ఆదా చేయవచ్చని కల్పన రమేష్ చెబుతున్నారు. నీటి నిర్వహణపై మహిళలు దృష్టిసారిస్తే భావితరాలకు చక్కటి ఆరోగ్యాన్నే కాకుండా... ప్రభుత్వాలపై భారం కూడా తగ్గించవచ్చని సూచిస్తున్నారు. నీటిని పొదుపు చేయడం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని కోరుతున్నారు. నీటి వృథాపై ప్రజలను చైతన్యపరిస్తూ ఐటీ కారిడార్​లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కల్పన రమేశ్​ దంపతులు.

ఇదీ చూడండి : నీటి కోసం బస్తీవాసుల భగీరథ యత్నం

Intro:పాలేరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో వర్గపోరు బజారుకి కెక్కింది ఏకంగా ఒక ఫంక్షన్ హాల్ లోనే నియోజకవర్గంలో 4 మండలాలు టిఆర్ఎస్ పార్టీ అసమ్మతి వర్గం సభ్యులు సమావేశమయ్యారు


Body:ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం లో ఎస్సార్ ఫంక్షన్ హాల్ లో టిఆర్ఎస్ పార్టీ అసమ్మతి వర్గం అంటే తుమ్మల వర్గీయులు సమావేశమయ్యారు నాలుగు మండలాల నుంచి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులను పక్కన పెట్టారని ఏకంగా గా సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వడం లేదని తన వర్గం వారికే అవకాశాలు కల్పిస్తోందని శాసనసభ ఎన్నికలలో తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసిన సందర్భాల్లో ఆయన మద్దతుదారులు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారని అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వారికి మాత్రమే ఉపేందర్రెడ్డి అవకాశం ఇస్తుందని మొన్న జరిగిన జడ్పిటిసి ఎంపీటీసీ ఉప ఎన్నికలలో ఉపేందర్ రెడ్డి తమ వర్గీయులకు ఇచ్చారని అసమ్మతి నేతలు బియ్యం పెట్టారు ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరి ముందు చేరిన టిఆర్ఎస్ పార్టీ నాయకులను పక్కన పెట్టారని వారికి కనీస గౌరవం దక్కడం లేదని అస్మత్ నేతలు అంటున్నారు సభ్యత నమోదు పుస్తకాలు ఇవ్వడం లేదని టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ర్ కేటీఆర్ సభ్యత్వాలు అందర్నీ షేర్ చేయాలని అయినప్పటికీ ఉపేందర్ రెడ్డి ఇ వారి మాటను పక్కన పెట్టి తమ వర్గీయులను పెంచి పోషిస్తున్నారని అసమ్మతి వర్గం నాయకులు చెప్పారు ఇదే పరిస్థితి ఏర్పడితే అసమ్మతి వర్గ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ ను కలిసి తమ సమస్యలను వివరిస్తామని వారు అన్నారు


Conclusion:బైట్స్ రామ సహాయం నరేష్ రెడ్డి ఇ టిఆర్ఎస్ పార్టీ నాయకులు
Last Updated : Jul 19, 2019, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.