ETV Bharat / city

కొత్త ప్రాజెక్టులు ఆపండి... రెండు రాష్ట్రాలకు కేంద్ర జల్‌శక్తి శాఖ లేఖ

author img

By

Published : Aug 9, 2020, 6:11 AM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టు పనులను ఆపాలని ముఖ్యమంత్రులకు కేంద్రం జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ ప్రక్రియను, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మూడో టీఎంసీ ఎత్తిపోత సహా ఏడు ప్రాజెక్టుల పనులను ఆపాలని సూచించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ప్రాజెక్టులను చేపట్టవద్దని పేర్కొన్నారు. వివాదాలు పరిష్కరించేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ జరగాల్సిన ఆవశ్యకత ఉందని లేఖలో పేర్కొన్నారు.

kcr
kcr

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్‌ ప్రక్రియను, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మూడో టీఎంసీ ఎత్తిపోత సహా ఏడు ప్రాజెక్టుల పనులను ఆపాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సూచించారు. కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌, గోదావరి బేసిన్‌లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులలో పరస్పరం రెండు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకొన్న వాటిని ఆపాలని కోరారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ప్రాజెక్టులను చేపట్టవద్దని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిలకు వేర్వేరుగా లేఖలు రాశారు.

ప్రాధాన్యత సంతరించుకుంది

రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఈ నెలలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాలు ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం, కృష్ణా, గోదావరి బోర్డులకు, కేంద్రానికి లేఖలు రాయడం, ఈనెల ఐదున జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులకు కేంద్రమంత్రి లేఖలు రాయడం ప్రాధాన్యం సంతరించుకొంది. కేంద్రమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులకు శనివారం లేఖలు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లేఖలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఉద్దేశించి సంయుక్తంగా కొంతభాగం ఉండగా, ప్రాజెక్టుల విషయంలో మాత్రమే ప్రత్యేక ప్రస్తావన ఉంది. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

ఏపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఈ నెల ఐదో తేదీన నిర్వహించేందుకు ప్రతిపాదించి ముఖ్యమంత్రుల అంగీకారం తెలుసుకోవాల్సిందిగా కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎలాంటి సమాధానం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. ముందుగానే నిర్ణయించుకొన్న కార్యక్రమాలు ఉన్నందున ఆగస్టు 20 తర్వాత నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కోరారని, ఈ కారణంగా సమావేశాన్ని వాయిదా వేశామని తెలిపారు. త్వరలోనే తదుపరి తేదీని తెలియజేస్తామన్నారు. మీ విజ్ఞప్తి మేరకే సమావేశాన్ని వాయిదా వేశామని తెలంగాణ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో స్పష్టం చేశారు.

ఏడు ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు

విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ గోదావరి నదిపై తెలంగాణ ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తోందని... ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కాళేశ్వరం, గోదావరి ఎత్తిపోతల పథకం మూడో దశ, సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం, తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు, లోయర్‌ పెన్‌గంగపై బ్యారేజీల నిర్మాణం, రామప్ప నుంచి పాకాల లేక్‌ మళ్లింపు వంటి ప్రాజెక్టులు... రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఈఏడాది మేలో అభ్యంతరాలు తెలిపిందని షెకావత్‌ ప్రస్తావించారు. 2018 జూన్‌లో ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా డీపీఆర్‌ ఆమోదం లేకుండా.. కాళేశ్వరం ద్వారా రోజుకు 2 టీఎంసీల తరలింపు సామర్థ్యాన్ని మూడు టీఎంసీలకు పెంచుతూ నిర్మాణం చేపట్టారని... ఏపీ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, డీపీఆర్‌లు అందించాలని... ఈ ఏడాది జూన్‌ 5న జరిగిన బోర్డు సమావేశంలో గోదావరి బోర్డు ఛైర్మన్‌ ఆదేశించినా ఇప్పటివరకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదని అధికారులు తనకు చెప్పినట్లు షెకావత్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో ఇకపై ముందుకు సాగవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో షెకావత్‌ కోరారు.

ముందుకెళ్లొద్దు

శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి రోజుకు 6 నుంచి 8 టీఎంసీల నీటిని వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణాలు చేపడుతోందని... తెలంగాణ ఫిర్యాదు చేసినట్లు సీఎం జగన్‌కు రాసిన లేఖలో కేంద్రమంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ చేపడుతున్న నిర్మాణాలపై డీపీఆర్‌లు ఇవ్వాలని కృష్ణా బోర్డు ఆదేశించినా ఇప్పటి వరకు అందించలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇటీవల ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచినట్లు... తనకు సమాచారం వచ్చినట్లు లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ అభ్యంతరాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగించవద్దని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు రాసిన లేఖలో షెకావత్ కోరారు. అపెక్స్‌ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి కార్యకాలపాలు చేపట్టవద్దన్నారు. తెలంగాణ అభ్యంతరం తెలిపిన ప్రాజెక్టులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా నిలిపివేయాలని జగన్‌ను కోరారు.

అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా ముందుకు సాగడం మంచిది కాదన్నారు. పరస్పరం ఫిర్యాదులు, వివాదాల నేపథ్యంలో ఈనెలలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిపేందుకు ముందుకు రావాలని... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులకు వేర్వేరుగా రాసిన లేఖల్లో కేంద్ర మంత్రి కోరారు.

కేంద్రం ఆపాలని సూచించిన ప్రాజెక్టులు

తెలంగాణలో..

1. కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతల

2. గోదావరి ఎత్తిపోతల మూడోదశ

3. సీతారామ ఎత్తిపోతల

4. తుపాకులగూడెం

5. తెలంగాణ తాగునీటి సరఫరా పథకం

6. లోయర్‌ పెన్‌గంగ నదిపై బ్యారేజీలు

7. రామప్ప లేక్‌ నుంచి పాకాల లేక్‌ మళ్లింపు పథకం

ఆంధ్రప్రదేశ్‌లో..

రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర పనులకు పిలిచిన టెండర్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్‌ ప్రక్రియను, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మూడో టీఎంసీ ఎత్తిపోత సహా ఏడు ప్రాజెక్టుల పనులను ఆపాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సూచించారు. కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌, గోదావరి బేసిన్‌లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులలో పరస్పరం రెండు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకొన్న వాటిని ఆపాలని కోరారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ప్రాజెక్టులను చేపట్టవద్దని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిలకు వేర్వేరుగా లేఖలు రాశారు.

ప్రాధాన్యత సంతరించుకుంది

రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఈ నెలలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాలు ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం, కృష్ణా, గోదావరి బోర్డులకు, కేంద్రానికి లేఖలు రాయడం, ఈనెల ఐదున జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులకు కేంద్రమంత్రి లేఖలు రాయడం ప్రాధాన్యం సంతరించుకొంది. కేంద్రమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులకు శనివారం లేఖలు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లేఖలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఉద్దేశించి సంయుక్తంగా కొంతభాగం ఉండగా, ప్రాజెక్టుల విషయంలో మాత్రమే ప్రత్యేక ప్రస్తావన ఉంది. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

ఏపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఈ నెల ఐదో తేదీన నిర్వహించేందుకు ప్రతిపాదించి ముఖ్యమంత్రుల అంగీకారం తెలుసుకోవాల్సిందిగా కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎలాంటి సమాధానం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. ముందుగానే నిర్ణయించుకొన్న కార్యక్రమాలు ఉన్నందున ఆగస్టు 20 తర్వాత నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కోరారని, ఈ కారణంగా సమావేశాన్ని వాయిదా వేశామని తెలిపారు. త్వరలోనే తదుపరి తేదీని తెలియజేస్తామన్నారు. మీ విజ్ఞప్తి మేరకే సమావేశాన్ని వాయిదా వేశామని తెలంగాణ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో స్పష్టం చేశారు.

ఏడు ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు

విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ గోదావరి నదిపై తెలంగాణ ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తోందని... ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కాళేశ్వరం, గోదావరి ఎత్తిపోతల పథకం మూడో దశ, సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం, తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు, లోయర్‌ పెన్‌గంగపై బ్యారేజీల నిర్మాణం, రామప్ప నుంచి పాకాల లేక్‌ మళ్లింపు వంటి ప్రాజెక్టులు... రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఈఏడాది మేలో అభ్యంతరాలు తెలిపిందని షెకావత్‌ ప్రస్తావించారు. 2018 జూన్‌లో ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా డీపీఆర్‌ ఆమోదం లేకుండా.. కాళేశ్వరం ద్వారా రోజుకు 2 టీఎంసీల తరలింపు సామర్థ్యాన్ని మూడు టీఎంసీలకు పెంచుతూ నిర్మాణం చేపట్టారని... ఏపీ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, డీపీఆర్‌లు అందించాలని... ఈ ఏడాది జూన్‌ 5న జరిగిన బోర్డు సమావేశంలో గోదావరి బోర్డు ఛైర్మన్‌ ఆదేశించినా ఇప్పటివరకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదని అధికారులు తనకు చెప్పినట్లు షెకావత్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో ఇకపై ముందుకు సాగవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో షెకావత్‌ కోరారు.

ముందుకెళ్లొద్దు

శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి రోజుకు 6 నుంచి 8 టీఎంసీల నీటిని వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణాలు చేపడుతోందని... తెలంగాణ ఫిర్యాదు చేసినట్లు సీఎం జగన్‌కు రాసిన లేఖలో కేంద్రమంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ చేపడుతున్న నిర్మాణాలపై డీపీఆర్‌లు ఇవ్వాలని కృష్ణా బోర్డు ఆదేశించినా ఇప్పటి వరకు అందించలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇటీవల ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచినట్లు... తనకు సమాచారం వచ్చినట్లు లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ అభ్యంతరాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగించవద్దని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు రాసిన లేఖలో షెకావత్ కోరారు. అపెక్స్‌ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి కార్యకాలపాలు చేపట్టవద్దన్నారు. తెలంగాణ అభ్యంతరం తెలిపిన ప్రాజెక్టులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా నిలిపివేయాలని జగన్‌ను కోరారు.

అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా ముందుకు సాగడం మంచిది కాదన్నారు. పరస్పరం ఫిర్యాదులు, వివాదాల నేపథ్యంలో ఈనెలలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిపేందుకు ముందుకు రావాలని... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులకు వేర్వేరుగా రాసిన లేఖల్లో కేంద్ర మంత్రి కోరారు.

కేంద్రం ఆపాలని సూచించిన ప్రాజెక్టులు

తెలంగాణలో..

1. కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతల

2. గోదావరి ఎత్తిపోతల మూడోదశ

3. సీతారామ ఎత్తిపోతల

4. తుపాకులగూడెం

5. తెలంగాణ తాగునీటి సరఫరా పథకం

6. లోయర్‌ పెన్‌గంగ నదిపై బ్యారేజీలు

7. రామప్ప లేక్‌ నుంచి పాకాల లేక్‌ మళ్లింపు పథకం

ఆంధ్రప్రదేశ్‌లో..

రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర పనులకు పిలిచిన టెండర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.