ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. ఉక్రెయిన్ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థులను భయపెడుతోంది. అక్కడ వందల సంఖ్యలో పాజిటివ్ లక్షణాలతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన 1500 మంది భారతీయులు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. వీరిలో 300 మంది తెలుగు విద్యార్ధులూ ఉన్నారు.
ఉక్రెయిన్లో చిక్కుకుపోయాం.. రక్షించండి..
ఒకరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 300 మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకున్నారు. కనీసం తిండి లేక ఆకలితోనే గడుపుతున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయినా వారిని పట్టించుకునే నాథుడే లేడు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎవరైనా కాపాడుతారేమోనన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.
![ఉక్రెయిన్లో చిక్కుకుపోయాం.. రక్షించండి.. ukn](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6606661-309-6606661-1585643389996.jpg?imwidth=3840)
ఉక్రెయిన్లో కేసుల సంఖ్య పెరుగుతుండడం.... వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్ధులకు లాక్డౌన్ కారణంగా సరైన ఆహారం లభించక అంతా అవస్థలు ఎదుర్కొంటున్నారు. భారత్కు తీసుకెళ్లాలని.. ఇండియన్ ఎంబసీని కోరుతున్నారు. పట్టించుకోకపోతే.. కరోనా మహమ్మారికి బలవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఈ చిట్కాలతో కరోనా లక్షణాల నుంచి ఉపశమనం!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. ఉక్రెయిన్ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థులను భయపెడుతోంది. అక్కడ వందల సంఖ్యలో పాజిటివ్ లక్షణాలతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన 1500 మంది భారతీయులు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. వీరిలో 300 మంది తెలుగు విద్యార్ధులూ ఉన్నారు.
ఉక్రెయిన్లో కేసుల సంఖ్య పెరుగుతుండడం.... వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్ధులకు లాక్డౌన్ కారణంగా సరైన ఆహారం లభించక అంతా అవస్థలు ఎదుర్కొంటున్నారు. భారత్కు తీసుకెళ్లాలని.. ఇండియన్ ఎంబసీని కోరుతున్నారు. పట్టించుకోకపోతే.. కరోనా మహమ్మారికి బలవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఈ చిట్కాలతో కరోనా లక్షణాల నుంచి ఉపశమనం!