రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కొరకు... పౌరులు సైకిల్ వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా ఇండియా సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తోంది. సైక్లింగ్ ఫ్రెండ్లీ సిటీలో హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్ నగరాలను కేంద్రం ఎంపిక చేసింది.
గ్రేటర్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు హెచ్ఎమ్డీఏ, హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పూర్తి సహకారాన్ని అందించనున్నాయి. మెుదటగా ఖైరతాబాద్ జోన్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందుకు సంబంధించి సైకిల్ ట్రాక్ల ఏర్పాట్లపై సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇదీ చూడండి : మారుతున్న వానాకాలం- దక్షిణాదిన ఇక భారీ వర్షాలు