ETV Bharat / city

రోగ నిరోధక శక్తితో కరోనాను జయించొచ్చు - కరోనా లక్షణాలు

వ్యాధి నిరోధక శక్తి పెంచుకోగలిగితే మనలో కరోనా వైరస్‌ ప్రవేశించినా ఏమీ కాదని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆవుల లక్ష్మయ్య వెల్లడించారు. వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా లేనివారికే ఈ వైరస్‌ ఎక్కువ నష్టం కలిగిస్తోందని తమ పరిశోధనలో తేలిందన్నారు. అందువల్ల పౌష్టికాహారంపై అందరూ దృష్టిసారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో ‘ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను వివరించారు.

రోగ నిరోధక శక్తితో కరోనాను జయించొచ్చు
immunity power
author img

By

Published : Mar 28, 2020, 12:04 PM IST

  • గతంలో వచ్చిన వైరస్‌లతో పోల్చుకుంటే కరోనా అత్యంత ప్రమాదకరమైనదేమీ కాదు. ప్రతి వ్యక్తిలో రోగనిరోధక శక్తి పూర్తిస్థాయిలో ఉంటే ఈ వైరస్‌ ఏమీ చేయదు. ఇప్పటి వరకు జరిగిన కరోనా మరణాలను పరిశీలిస్తే వృద్ధులు, చిన్నపిల్లలే బలయ్యారు. వైరస్‌పై మా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
  • ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే దేశంలోని ప్రతి ఒక్కరూ ఇక నుంచైనా కూడా బలవర్ధక ఆహార పదార్థాలపై దృష్టి సారించాలి.
  • పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి. ప్రధానంగా చిరుధాన్యాలను వినియోగించాలి. డ్రైఫ్రూట్స్‌ కూడా తీసుకుంటే బాగుంటుంది.
  • పుల్లగా ఉండే పండ్లను తినడం వల్ల విటమిన్‌-సి సమృద్ధిగా అంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మ, బత్తాయి, కమలాపండ్లను ఈ సీజన్‌లో అధికంగా తీసుకోవచ్చు.
  • అల్లం, వెల్లుల్లి, పసుపు, బొప్పాయి, గ్రీన్‌టీ తీసుకోవచ్చు.
  • బొచ్చెలు, శీలావతి లాంటి తెల్లరకం చేపలను, పీతలను కూడా తీసుకోవచ్చు. పీతల్లో జింక్‌ లాంటి సూక్ష్మ పోషకాలు ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • రోజూ కచ్చితంగా మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి.
  • వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరూ రోజుకు పదిసార్లయినా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. అప్పుడే ఈ వ్యాధి వ్యాప్తిని పూర్తిస్థాయిలో కట్టడి చేయగలం.

  • గతంలో వచ్చిన వైరస్‌లతో పోల్చుకుంటే కరోనా అత్యంత ప్రమాదకరమైనదేమీ కాదు. ప్రతి వ్యక్తిలో రోగనిరోధక శక్తి పూర్తిస్థాయిలో ఉంటే ఈ వైరస్‌ ఏమీ చేయదు. ఇప్పటి వరకు జరిగిన కరోనా మరణాలను పరిశీలిస్తే వృద్ధులు, చిన్నపిల్లలే బలయ్యారు. వైరస్‌పై మా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
  • ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే దేశంలోని ప్రతి ఒక్కరూ ఇక నుంచైనా కూడా బలవర్ధక ఆహార పదార్థాలపై దృష్టి సారించాలి.
  • పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి. ప్రధానంగా చిరుధాన్యాలను వినియోగించాలి. డ్రైఫ్రూట్స్‌ కూడా తీసుకుంటే బాగుంటుంది.
  • పుల్లగా ఉండే పండ్లను తినడం వల్ల విటమిన్‌-సి సమృద్ధిగా అంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మ, బత్తాయి, కమలాపండ్లను ఈ సీజన్‌లో అధికంగా తీసుకోవచ్చు.
  • అల్లం, వెల్లుల్లి, పసుపు, బొప్పాయి, గ్రీన్‌టీ తీసుకోవచ్చు.
  • బొచ్చెలు, శీలావతి లాంటి తెల్లరకం చేపలను, పీతలను కూడా తీసుకోవచ్చు. పీతల్లో జింక్‌ లాంటి సూక్ష్మ పోషకాలు ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • రోజూ కచ్చితంగా మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి.
  • వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరూ రోజుకు పదిసార్లయినా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. అప్పుడే ఈ వ్యాధి వ్యాప్తిని పూర్తిస్థాయిలో కట్టడి చేయగలం.

ఇవీ చూడండి: 60 వేల మందికి కరోనా వచ్చినా చికిత్సలకు సన్నద్ధం: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.