మహిళ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బృందం కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనకు తరలివెళ్లింది. కేరళలో చిన్నారులకు మంచి పౌష్టిక ఆహారం అందిస్తుందన్నారని... గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ తెలిపారు.
ఈ విషయంలో కేరళ రాష్ట్రం మంచి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ బృందం విస్తృతంగా పర్యటించనుంది. అక్కడి సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, గ్రామీణ పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఐఏఎస్, ఐపీఎస్ల బృందం అధ్యయనం చేయనుంది.