ETV Bharat / city

కామన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను వాడకూడదు: సీవీ ఆనంద్

author img

By

Published : Apr 15, 2022, 6:17 PM IST

Updated : Apr 15, 2022, 6:40 PM IST

Hyderabad CP meeting with Bankers: బ్యాంకుల సర్వర్లు హ్యాక్ అవ్వడానికి కారణం సైబర్ భద్రతకు సరైన నిధులు కేటాయించకపోవడమేనని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు. కామన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను వాడరాదని.. సైబర్ దాడులు పెరుగుతున్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని పలు అర్బన్ కోపరేటివ్ బ్యాంకు అధికారులతో ఆర్​బీఐ ప్రాంతీయ డైరెక్టర్ ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ పాల్గొన్నారు.

Hyderabad CP meeting with Bankers
హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌

Hyderabad CP meeting with Bankers: సైబర్ దాడులు పెరుగుతున్నందున బ్యాంకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బ్యాంకుల సర్వర్లు హ్యాక్ అవ్వడానికి కారణం సైబర్ భద్రతకు సరైన నిధులు కేటాయించకపోవడమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు అర్బన్ కోపరేటివ్ బ్యాంకు అధికారులతో ఆర్​బీఐ ప్రాంతీయ డైరెక్టర్... హైదరాబాద్‌ మాసబ్ ట్యాంక్‌లోని ఓ హోటల్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీవీ ఆనంద్ పాల్గొన్నారు.

Hyderabad CP meeting with Bankers
సమావేశానికి హాజరైన బ్యాంక్ అధికారులు

ఈ సమావేశానికి సీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, నాబార్డ్, 51 అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు చెందిన అధికారులు హాజరయ్యారు. మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాక్ చేసి సుమారు పన్నెండున్నర కోట్లను కొల్లగొట్టిన ఉదంతాన్ని సీపీ గుర్తు చేశారు. ఫిషింగ్ మెయిల్, ట్రోజన్స్, కీ లాగర్ సాఫ్టువేర్‌ల ద్వారా ప్రధాన డేటాబేస్‌లోకి ప్రవేశించి హాకింగ్‌కు పాల్పడిన విధానాన్ని వివరించారు. రెండు నెలల సుదీర్ఘమైన దర్యాప్తు చేపట్టి నైజీరియాకు చెందిన నలుగురు సూత్రధారులు సహా 23 మందిని అదుపులోకి తీసుకొని 3కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

కామన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను వాడరాదని తెలిపారు. సైబర్ దాడులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ పరిధిలో పనిచేస్తున్న భద్రతా ప్రమాణాలు పాటించని బ్యాంకులపై చర్యలు తీసుకుంటే.. హ్యకింగ్ ఘటనలు పునరావృతం కావని ఆర్బీఐ అధికారులను కోరారు. సైబర్ భద్రతపై సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ఫలితంగా ఆదిలోనే సమస్యను గుర్తించి పరిష్కరించుకోవచ్చని సీపీ తెలిపారు.

ఇదీ చదవండి:చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్‌ మార్క్‌గా కేసీఆర్‌: సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

Hyderabad CP meeting with Bankers: సైబర్ దాడులు పెరుగుతున్నందున బ్యాంకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బ్యాంకుల సర్వర్లు హ్యాక్ అవ్వడానికి కారణం సైబర్ భద్రతకు సరైన నిధులు కేటాయించకపోవడమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు అర్బన్ కోపరేటివ్ బ్యాంకు అధికారులతో ఆర్​బీఐ ప్రాంతీయ డైరెక్టర్... హైదరాబాద్‌ మాసబ్ ట్యాంక్‌లోని ఓ హోటల్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీవీ ఆనంద్ పాల్గొన్నారు.

Hyderabad CP meeting with Bankers
సమావేశానికి హాజరైన బ్యాంక్ అధికారులు

ఈ సమావేశానికి సీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, నాబార్డ్, 51 అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు చెందిన అధికారులు హాజరయ్యారు. మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాక్ చేసి సుమారు పన్నెండున్నర కోట్లను కొల్లగొట్టిన ఉదంతాన్ని సీపీ గుర్తు చేశారు. ఫిషింగ్ మెయిల్, ట్రోజన్స్, కీ లాగర్ సాఫ్టువేర్‌ల ద్వారా ప్రధాన డేటాబేస్‌లోకి ప్రవేశించి హాకింగ్‌కు పాల్పడిన విధానాన్ని వివరించారు. రెండు నెలల సుదీర్ఘమైన దర్యాప్తు చేపట్టి నైజీరియాకు చెందిన నలుగురు సూత్రధారులు సహా 23 మందిని అదుపులోకి తీసుకొని 3కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

కామన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను వాడరాదని తెలిపారు. సైబర్ దాడులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ పరిధిలో పనిచేస్తున్న భద్రతా ప్రమాణాలు పాటించని బ్యాంకులపై చర్యలు తీసుకుంటే.. హ్యకింగ్ ఘటనలు పునరావృతం కావని ఆర్బీఐ అధికారులను కోరారు. సైబర్ భద్రతపై సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ఫలితంగా ఆదిలోనే సమస్యను గుర్తించి పరిష్కరించుకోవచ్చని సీపీ తెలిపారు.

ఇదీ చదవండి:చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్‌ మార్క్‌గా కేసీఆర్‌: సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

Last Updated : Apr 15, 2022, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.