ETV Bharat / city

రేవంత్ అంశంపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోండి: హైకోర్టు

భద్రత కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని రేవంత్ రెడ్డికి హైకోర్టు సూచించింది. దీనిపై ఆరు వారాల్లో చట్ట ప్రకారం పరిష్కరించాలని కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

author img

By

Published : Mar 3, 2020, 11:13 PM IST

Updated : Mar 3, 2020, 11:26 PM IST

revanth
revanth

తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలన్న ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా దరఖాస్తు చేసుకుంటే.. దానిపై ఆరు వారాల్లో చట్టపరంగా తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. భద్రత కోసం కేంద్ర హోంశాఖకు తాజాగా దరఖాస్తు చేసుకోవాలని రేవంత్ రెడ్డికి ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం

కేంద్ర బలగాలతో ఎస్కార్టు, 4 ప్లస్ 4 భద్రత కల్పించాలని కోరుతూ గతేడాది సమర్పించిన దరఖాస్తును పరిష్కరించేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న రేవంత్ రెడ్డి పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి గతేడాది ఆగస్టులో ఆదేశించినప్పటికీ... హోంశాఖ కార్యదర్శి ఇప్పటి వరకు స్పందించలేదని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది పి.వేణుగోపాల్ వాదించారు. పిటిషన్​లో పేర్కొన్నంతగా రేవంత్ రెడ్డికి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ వాదించారు. రేవంత్ రెడ్డి తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయమూ అవసరమే..

తాజాగా దరఖాస్తు చేసుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించిన హైకోర్టు.. ఆరు వారాల్లో చట్ట ప్రకారం పరిష్కరించాలని కేంద్ర హోంశాఖకు హైకోర్టు స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి భద్రత రాష్ట్ర పరిధిలో అంశం కాబట్టి.. కేంద్రం నిర్ణయం తీసుకునే ముందు.. ముప్పు ఉందా లేదా అనే అంశంపై రాష్ట్ర నిఘా వర్గాల నుంచి సమాచారం తీసుకోవాలని శరత్ వాదించారు. నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఇదీ చూడండి: ప్రాణహాని ఉంది రక్షణ పెంచండి: ఎంపీ రేవంత్ రెడ్డి

తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలన్న ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా దరఖాస్తు చేసుకుంటే.. దానిపై ఆరు వారాల్లో చట్టపరంగా తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. భద్రత కోసం కేంద్ర హోంశాఖకు తాజాగా దరఖాస్తు చేసుకోవాలని రేవంత్ రెడ్డికి ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం

కేంద్ర బలగాలతో ఎస్కార్టు, 4 ప్లస్ 4 భద్రత కల్పించాలని కోరుతూ గతేడాది సమర్పించిన దరఖాస్తును పరిష్కరించేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న రేవంత్ రెడ్డి పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి గతేడాది ఆగస్టులో ఆదేశించినప్పటికీ... హోంశాఖ కార్యదర్శి ఇప్పటి వరకు స్పందించలేదని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది పి.వేణుగోపాల్ వాదించారు. పిటిషన్​లో పేర్కొన్నంతగా రేవంత్ రెడ్డికి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ వాదించారు. రేవంత్ రెడ్డి తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయమూ అవసరమే..

తాజాగా దరఖాస్తు చేసుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించిన హైకోర్టు.. ఆరు వారాల్లో చట్ట ప్రకారం పరిష్కరించాలని కేంద్ర హోంశాఖకు హైకోర్టు స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి భద్రత రాష్ట్ర పరిధిలో అంశం కాబట్టి.. కేంద్రం నిర్ణయం తీసుకునే ముందు.. ముప్పు ఉందా లేదా అనే అంశంపై రాష్ట్ర నిఘా వర్గాల నుంచి సమాచారం తీసుకోవాలని శరత్ వాదించారు. నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఇదీ చూడండి: ప్రాణహాని ఉంది రక్షణ పెంచండి: ఎంపీ రేవంత్ రెడ్డి

Last Updated : Mar 3, 2020, 11:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.