ETV Bharat / city

Ap High court: 'తితిదే' కేసులో మీరెలా పిల్ వేస్తారు?' - తితిదే కేసు వార్తలు

పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తులో పురోగతి లేకపోతే ఫిర్యాదు చేసిన వ్యక్తి హైకోర్టును ఆశ్రయించవచ్చు కానీ... మీరు ఏవిధంగా పిల్ దాఖలు చేస్తారంటూ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి, మరో పిటిషనర్ న్యాయవాది సత్యసభర్వాల్​ను ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. లక్షలాది మంది భక్తులు విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి పిల్ దాఖలు చేశామని న్యాయవాది సత్యసబర్వాల్ తెలిపారు.

AP High Court
తితిదే కేసులో రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామిని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు
author img

By

Published : Jun 17, 2021, 8:14 AM IST

పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తులో పురోగతి లేకపోతే ఫిర్యాదుదారు హైకోర్టును ఆశ్రయించవచ్చని... అంతే తప్ప ఈ వ్యవహారంపై మీరు ఎలా పిల్ దాఖలు చేస్తారని తితిదేపై 2019లో ఓ పత్రిక ప్రచురించిన కథనంపై కేసులో... రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి, మరో పిటిషనర్ న్యాయవాది సత్యసభర్వాల్​ను ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్. జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈకేసుపై విచారణ జరిపింది.

తితిదేపై ఓ పత్రిక ప్రచురించిన కథనంపై తితిదే విజిలెన్స్ కమిషనరు... ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతి తూర్పు ఠాణాలో 2019 డిసెంబరు 14న ఎఫ్​ఐఆర్ నమోదైంది. కేసు నమోదు చేసినా దర్యాప్తులో పురోగతి లేదంటూ ఎంపీ సుబ్రమణ్యస్వామి, న్యాయవాది సత్య సబర్వాల్ ఈ ఏడాది మార్చిలో ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

బుధవారం దీనిపై విచారణ సందర్భంగా... మీరెలా పిల్ వేస్తారని ధర్మాసనం వారిని ప్రశ్నించింది. లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి పిల్ దాఖలు చేశామని న్యాయవాది సత్యసబర్వాల్ తెలిపారు. ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని... ఆయన వాదనలు వినిపిస్తారని చెప్పారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: Today Horoscope: నేటి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..!

పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తులో పురోగతి లేకపోతే ఫిర్యాదుదారు హైకోర్టును ఆశ్రయించవచ్చని... అంతే తప్ప ఈ వ్యవహారంపై మీరు ఎలా పిల్ దాఖలు చేస్తారని తితిదేపై 2019లో ఓ పత్రిక ప్రచురించిన కథనంపై కేసులో... రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి, మరో పిటిషనర్ న్యాయవాది సత్యసభర్వాల్​ను ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్. జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈకేసుపై విచారణ జరిపింది.

తితిదేపై ఓ పత్రిక ప్రచురించిన కథనంపై తితిదే విజిలెన్స్ కమిషనరు... ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతి తూర్పు ఠాణాలో 2019 డిసెంబరు 14న ఎఫ్​ఐఆర్ నమోదైంది. కేసు నమోదు చేసినా దర్యాప్తులో పురోగతి లేదంటూ ఎంపీ సుబ్రమణ్యస్వామి, న్యాయవాది సత్య సబర్వాల్ ఈ ఏడాది మార్చిలో ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

బుధవారం దీనిపై విచారణ సందర్భంగా... మీరెలా పిల్ వేస్తారని ధర్మాసనం వారిని ప్రశ్నించింది. లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి పిల్ దాఖలు చేశామని న్యాయవాది సత్యసబర్వాల్ తెలిపారు. ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని... ఆయన వాదనలు వినిపిస్తారని చెప్పారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: Today Horoscope: నేటి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.