ETV Bharat / city

Heart Transplantation: నిమ్స్​కు చేరుకున్న గుండె.. హార్ట్​ ట్రాన్స్​ప్లాంటేషన్​ ప్రారంభం

author img

By

Published : Sep 15, 2021, 2:00 PM IST

Updated : Sep 15, 2021, 2:17 PM IST

హైదరాబాద్​ మలక్​పేట యశోద నుంచి పంజాగుట్టలోని నిమ్స్​కు గుండె చేరుకుంది. గ్రీన్​ఛానల్​ ద్వారా ప్రత్యేక అంబులెన్స్​లో నిమ్స్​కు గుండెను తరలించారు. ఇప్పటికే శస్త్ర చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేసిన వైద్యులు.. ఆస్పత్రికి గుండె చేరుకోగానే.. ఆపరేషన్​ ప్రారంభించారు.

Heart Transplantation operation started in panjagutta nims
Heart Transplantation operation started in panjagutta nims
నిమ్స్​కు చేరుకున్న గుండె.. హార్ట్​ ట్రాన్స్​ప్లాంటేషన్​ ప్రారంభం

హార్ట్​ ట్రాన్స్​ప్లాంటేషన్​ ఆపరేషన్​ కోసం గ్రీన్​ఛానల్​ ద్వారా పంజాగుట్ట నిమ్స్​కు గుండె చేరుకుంది. మలక్​పేట్​ యశోద ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1.44 గంటలకు గుండెను తీసుకుని ప్రత్యేక అంబులెన్స్​ బయలుదేరింది. గ్రీన్​ఛానల్​ ఏర్పాటు చేయటం వల్ల ఎలాంటి ట్రాఫిక్​ అంతరాయం లేకుండా.. పంజాగుట్ట నిమ్స్​కు 1.56కు చేరింది. కేవలం 12 నిమిషాల్లో అంబులెన్స్​ చేరుకుంది.

నిమ్స్​ ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు వైద్యులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రమాదంలో గాయపడి బ్రెయిన్​డెడ్​ అయిన ఓ కానిస్టేబుల్​ హృదయాన్ని.. నిమ్స్​లో చికిత్స పొందుతున్న రోగికి మార్పిడి చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన వీరబాబు​.. కొండాపూర్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న విధులకు వెళ్తుండగా... గొల్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందే క్రమంలో బ్రెయిన్​డెడ్​ అయినట్లు వైద్యులు మంగళవారం ప్రకటించారు. మృతుడి హృదయాన్ని దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు రావడంతో.. పంజాగుట్టలోని నిమ్స్​లో చికిత్స పొందుతున్న రోగికి గుండెను మార్పిడి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అధికారులు గ్రీన్​ ఛానల్ ఏర్పాటు చేశారు.

నిమ్స్‌లో గతంలోనూ పలుమార్లు గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించగా.. మొదటి సారి బయటి ఆస్పత్రి నుంచి నిమ్స్​కు గుండెను తరలిస్తున్నారు. కానిస్టేబుల్​ వీరబాబు గుండెను.. 30 ఏళ్లలోపు పెయింటర్​కు అమర్చుతున్నారు. నిమ్స్​లో చికిత్స పొందుతున్న పెయింటర్​ గుండె కోసం మంగళవారం జీవన్​దాన్​లో నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న ఒక్క రోజులోనే హృదయం లభించటం చాలా అరుదైన విషయం.

ఇదీ చూడండి:

నిమ్స్​కు చేరుకున్న గుండె.. హార్ట్​ ట్రాన్స్​ప్లాంటేషన్​ ప్రారంభం

హార్ట్​ ట్రాన్స్​ప్లాంటేషన్​ ఆపరేషన్​ కోసం గ్రీన్​ఛానల్​ ద్వారా పంజాగుట్ట నిమ్స్​కు గుండె చేరుకుంది. మలక్​పేట్​ యశోద ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1.44 గంటలకు గుండెను తీసుకుని ప్రత్యేక అంబులెన్స్​ బయలుదేరింది. గ్రీన్​ఛానల్​ ఏర్పాటు చేయటం వల్ల ఎలాంటి ట్రాఫిక్​ అంతరాయం లేకుండా.. పంజాగుట్ట నిమ్స్​కు 1.56కు చేరింది. కేవలం 12 నిమిషాల్లో అంబులెన్స్​ చేరుకుంది.

నిమ్స్​ ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు వైద్యులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రమాదంలో గాయపడి బ్రెయిన్​డెడ్​ అయిన ఓ కానిస్టేబుల్​ హృదయాన్ని.. నిమ్స్​లో చికిత్స పొందుతున్న రోగికి మార్పిడి చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన వీరబాబు​.. కొండాపూర్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న విధులకు వెళ్తుండగా... గొల్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందే క్రమంలో బ్రెయిన్​డెడ్​ అయినట్లు వైద్యులు మంగళవారం ప్రకటించారు. మృతుడి హృదయాన్ని దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు రావడంతో.. పంజాగుట్టలోని నిమ్స్​లో చికిత్స పొందుతున్న రోగికి గుండెను మార్పిడి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అధికారులు గ్రీన్​ ఛానల్ ఏర్పాటు చేశారు.

నిమ్స్‌లో గతంలోనూ పలుమార్లు గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించగా.. మొదటి సారి బయటి ఆస్పత్రి నుంచి నిమ్స్​కు గుండెను తరలిస్తున్నారు. కానిస్టేబుల్​ వీరబాబు గుండెను.. 30 ఏళ్లలోపు పెయింటర్​కు అమర్చుతున్నారు. నిమ్స్​లో చికిత్స పొందుతున్న పెయింటర్​ గుండె కోసం మంగళవారం జీవన్​దాన్​లో నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న ఒక్క రోజులోనే హృదయం లభించటం చాలా అరుదైన విషయం.

ఇదీ చూడండి:

Last Updated : Sep 15, 2021, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.