ETV Bharat / city

వ్యాక్సిన్​పై ఆందోళన వద్దు.. అవగాహన పెంచుకోండి: గవర్నర్

author img

By

Published : Jan 2, 2021, 3:12 PM IST

Updated : Jan 2, 2021, 3:37 PM IST

హైదరాబాద్​ తిలక్​నగర్​ యూపీహెచ్​సీలో నిర్వహించిన వ్యాక్సిన్​ డ్రైరన్​ను గవర్నర్​ దంపతులు పరిశీలించారు. డ్రైరన్​ ఏర్పాట్ల పట్ల హర్షం వ్యక్తం చేసిన గవర్నర్​ తమిళిసై... వ్యాక్సినేషన్​ గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.

governor tamilisai soundar rajan visited thilak nagar uphc dry run
governor tamilisai soundar rajan visited thilak nagar uphc dry run
'వ్యాక్సిన్​ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు'

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ చేపట్టిన నేపథ్యంలో హైదరాబాద్​లోని తిలక్​నగర్ యూపీహెచ్​సీని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించారు. యూపీహెచ్​సీకి వచ్చిన గవర్నర్ దంపతులకు హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, జేడీ ఇమ్యునైజేషన్ సుధీర, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ డీఎంహెచ్ఓ... స్వాగతం పలికారు.

యూపీహెచ్​సీలో వ్యాక్సిన్ డ్రై రన్​కి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన గవర్నర్​కు... వైద్యులు వ్యాక్సినేషన్​ పద్ధతిని వివరించారు. వ్యాక్సిన్​ గురించి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వ్యాక్సినేషన్​ జరుగనుందని... వ్యాక్సిన్​ వల్ల ఎలాంటి పరిణామాలు ఉండవని స్పష్టం చేశారు. డ్రైరన్​ ఏర్పాట్ల పట్ల గవర్నర్​ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలంతా కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇదీ చూడండి: 'కొవాగ్జిన్​' అనుమతిపై నిపుణుల కమిటీ భేటీ

'వ్యాక్సిన్​ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు'

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ చేపట్టిన నేపథ్యంలో హైదరాబాద్​లోని తిలక్​నగర్ యూపీహెచ్​సీని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించారు. యూపీహెచ్​సీకి వచ్చిన గవర్నర్ దంపతులకు హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, జేడీ ఇమ్యునైజేషన్ సుధీర, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ డీఎంహెచ్ఓ... స్వాగతం పలికారు.

యూపీహెచ్​సీలో వ్యాక్సిన్ డ్రై రన్​కి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన గవర్నర్​కు... వైద్యులు వ్యాక్సినేషన్​ పద్ధతిని వివరించారు. వ్యాక్సిన్​ గురించి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వ్యాక్సినేషన్​ జరుగనుందని... వ్యాక్సిన్​ వల్ల ఎలాంటి పరిణామాలు ఉండవని స్పష్టం చేశారు. డ్రైరన్​ ఏర్పాట్ల పట్ల గవర్నర్​ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలంతా కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇదీ చూడండి: 'కొవాగ్జిన్​' అనుమతిపై నిపుణుల కమిటీ భేటీ

Last Updated : Jan 2, 2021, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.