ETV Bharat / city

'ఏపీలో రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్‌అవర్ పాటించండి'

author img

By

Published : Mar 26, 2022, 5:14 PM IST

Governor Biswabhusan on Earth Hour: ఏపీలో నేడు ఎర్త్‌అవర్​ను పాటించాలని ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ సూచించారు. రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఎర్త్‌అవర్​ను పాటించాలని ఆయన కోరారు.

'ఏపీలో రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్‌అవర్ పాటించండి'
'ఏపీలో రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్‌అవర్ పాటించండి'

Earth Hour on March 26th: ఏపీలో నేడు ఎర్త్‌అవర్​ను పాటించాలని ప్రజలను ఆ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్​ కోరారు. పర్యావరణ చైతన్యవ్యాప్తి ఉద్యమంలో భాగంగా.. రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఎర్త్‌అవర్ పాటించాలన్నారు. అత్యవసరమైతేనే లైట్లు, ఇతర పరికరాలు వాడాలని గవగ్నర్​ సూచించారు. ఎర్త్‌ అవర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు.

భూమి మీద వెలువడుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, ఇంధనాలు, విద్యుత్‌ను ఆదా చేయడం కోసం ఏర్పడిన ప్రజాచైతన్య ఉద్యమమే ఈ ఎర్త్‌ అవర్‌. పర్యావరణ చైతన్య ఉద్యమంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 26న రాత్రి ఎర్త్‌అవర్ పాటిస్తారు. ఈ సందర్భంగా.. చారిత్రక కట్టడాలు, స్మృతి కేంద్రాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో లైట్లు ఆర్పేస్తారు. గంటపాటు చీకట్లలో ఉండిపోతారు. వాతావరణ మార్పుల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు గత పదేండ్లుగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Earth Hour on March 26th: ఏపీలో నేడు ఎర్త్‌అవర్​ను పాటించాలని ప్రజలను ఆ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్​ కోరారు. పర్యావరణ చైతన్యవ్యాప్తి ఉద్యమంలో భాగంగా.. రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఎర్త్‌అవర్ పాటించాలన్నారు. అత్యవసరమైతేనే లైట్లు, ఇతర పరికరాలు వాడాలని గవగ్నర్​ సూచించారు. ఎర్త్‌ అవర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు.

భూమి మీద వెలువడుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, ఇంధనాలు, విద్యుత్‌ను ఆదా చేయడం కోసం ఏర్పడిన ప్రజాచైతన్య ఉద్యమమే ఈ ఎర్త్‌ అవర్‌. పర్యావరణ చైతన్య ఉద్యమంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 26న రాత్రి ఎర్త్‌అవర్ పాటిస్తారు. ఈ సందర్భంగా.. చారిత్రక కట్టడాలు, స్మృతి కేంద్రాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో లైట్లు ఆర్పేస్తారు. గంటపాటు చీకట్లలో ఉండిపోతారు. వాతావరణ మార్పుల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు గత పదేండ్లుగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: భార్య, అత్తమామలపై కత్తితో దాడి.. కత్తితో రోడ్డుపైనే దారుణంగా!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.