ETV Bharat / city

ఆ 33 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీస్​ ఫ్రీ

author img

By

Published : Mar 15, 2021, 10:29 PM IST

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఏవోబీలోని మారుమూల గ్రామాలకు ఏపీలోని విశాఖ జిల్లా పోలీసులు ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసు సౌకర్యం కల్పించారు. ఈ సర్వీసు అన్నవరం నుంచి కోరుకొండ వరకు ప్రతి రోజు మూడు సార్లు ఉచితంగా నడుపనున్నట్లు ఏఎస్పీ విద్యాసాగర్ తెలిపారు.

free-bus-service-to-remote-villages-of-aob
ఆ 33 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీస్​ ఫ్రీ

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మారుమూల గ్రామాల‌కు ఏపీలోని విశాఖ జిల్లా పోలీసులు ఉచిత ఆర్టీసీ బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించారు. ఏవోబీలోని బలపం పంచాయతీ, ఆ చుట్టుపక్కల గ్రామాల గిరిజనుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్సును ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రారంభించారు. మన్యంలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు సరైన రహదారి, రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారని ఏఎస్పీ తెలిపారు. వారి సమస్యలను దృష్టిలో ఉంచుకుని బలపం పంచాయతీ పరిధిలోని 33 గ్రామాలతోపాటు ఒడిశా ప్రజలకు సౌకర్యవంతగా ఉంటుందని బస్సు సర్వీసు ప్రారంభించామన్నారు.

ఈ సర్వీసు అన్నవరం నుంచి కోరుకొండ వరకు ప్రతిరోజు మూడు సార్లు ఉచితంగా నడుపనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. బస్సు సర్వీసును గిరిజనలు సద్వినియోగం చేసుకుని సురక్షితమైన ప్రయాణానికి నాంది పలకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్ఎస్.నాయుడు, చింతపల్లి సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మారుమూల గ్రామాల‌కు ఏపీలోని విశాఖ జిల్లా పోలీసులు ఉచిత ఆర్టీసీ బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించారు. ఏవోబీలోని బలపం పంచాయతీ, ఆ చుట్టుపక్కల గ్రామాల గిరిజనుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్సును ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రారంభించారు. మన్యంలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు సరైన రహదారి, రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారని ఏఎస్పీ తెలిపారు. వారి సమస్యలను దృష్టిలో ఉంచుకుని బలపం పంచాయతీ పరిధిలోని 33 గ్రామాలతోపాటు ఒడిశా ప్రజలకు సౌకర్యవంతగా ఉంటుందని బస్సు సర్వీసు ప్రారంభించామన్నారు.

ఈ సర్వీసు అన్నవరం నుంచి కోరుకొండ వరకు ప్రతిరోజు మూడు సార్లు ఉచితంగా నడుపనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. బస్సు సర్వీసును గిరిజనలు సద్వినియోగం చేసుకుని సురక్షితమైన ప్రయాణానికి నాంది పలకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్ఎస్.నాయుడు, చింతపల్లి సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : ప్రతిధ్వని: ఎయిర్​పోర్టుల వాటా అమ్మకంతో కేంద్రం ఏం ఆశిస్తోంది?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.