ETV Bharat / city

మద్యం షాపుల తెరుస్తున్నారని ప్రచారం చేసిన వ్యక్తి అరెస్టు - fake go on wines shop opening

లాక్​డౌన్​తో నిత్యావసరాలు తప్ప అన్నీ మూతపడ్డాయి. కానీ ఓ అకతాయి మద్యం దుకాణాలు తెరవనున్నట్టు ఆబ్కారీ శాఖ పేరున జీవో విడుదల చేసి కటకటాలపాలయ్యాడు. అసత్య వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.

fake go release person arrest in uppal
నకిలీ జీవో సృష్టికర్త అరెస్టు.. రిమాండ్​కు తరలింపు
author img

By

Published : Mar 31, 2020, 2:50 PM IST

Updated : Mar 31, 2020, 5:38 PM IST

మద్యం విక్రయానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు నకిలీ జీవో తయారీ చేసిన ఉప్పల్​కు విజయపురి కాలనీకి చెందిన కె. శనీష్ కుమార్​ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారించగా... తాను ట్విట్టర్​ నుంచి డౌన్​లోడ్​ చేసినట్టు చెప్పాడు. కానీ సంబంధిత ఖాతాను పరిశీలించగా ఎలాంటి జీవో కనపడలేదు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. తప్పుడు సమాచారం వైరస్ చేసిన మరికొంత మందికి నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు.

గత శనివారం రోజున మధ్యాహ్నం రెండు నుంచి ఐదున్నర వరకు మద్యం విక్రయించనున్నట్టు ఆబ్కారీ శాఖ పేరున జీవోను సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. అలా వేల మందికి సదరు సమాచారం చేరింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సైబర్​ క్రైమ్​ పోలీసులు నిందితుడి కోసం గాలించి పట్టుకున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఎంతటి వారినైనా శిక్షిస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.

మద్యం షాపుల తెరుస్తున్నారని ప్రచారం చేసిన వ్యక్తి అరెస్టు

ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

మద్యం విక్రయానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు నకిలీ జీవో తయారీ చేసిన ఉప్పల్​కు విజయపురి కాలనీకి చెందిన కె. శనీష్ కుమార్​ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారించగా... తాను ట్విట్టర్​ నుంచి డౌన్​లోడ్​ చేసినట్టు చెప్పాడు. కానీ సంబంధిత ఖాతాను పరిశీలించగా ఎలాంటి జీవో కనపడలేదు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. తప్పుడు సమాచారం వైరస్ చేసిన మరికొంత మందికి నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు.

గత శనివారం రోజున మధ్యాహ్నం రెండు నుంచి ఐదున్నర వరకు మద్యం విక్రయించనున్నట్టు ఆబ్కారీ శాఖ పేరున జీవోను సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. అలా వేల మందికి సదరు సమాచారం చేరింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సైబర్​ క్రైమ్​ పోలీసులు నిందితుడి కోసం గాలించి పట్టుకున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఎంతటి వారినైనా శిక్షిస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.

మద్యం షాపుల తెరుస్తున్నారని ప్రచారం చేసిన వ్యక్తి అరెస్టు

ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

Last Updated : Mar 31, 2020, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.