ETV Bharat / city

ప్రభుత్వ ఆస్పత్రిలో భూత వైద్యం.. డాక్టర్లు ఏం చేస్తున్నారు?

author img

By

Published : Jul 27, 2021, 10:02 AM IST

ఆమెకు జ్వరం వచ్చింది. ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నాలుగు రోజులైంది. అయినా మార్పు రాలేదు. రోజురోజుకూ నీరసించిపోతోంది. చివరికి అందుబాటులో ఉన్న మహిళా భూత వైద్యురాలిని ఆస్పత్రి వార్డుకు తీసుకొచ్చారు. ఆమె వార్డులోనే రోగి నాడి పట్టుకుని మంత్రాలు జపించింది. ఈ దృశ్యం విశాఖ ఏజెన్సీ పాడేరు ఆస్పత్రిలో కలకలం సృష్టించింది.

exorcist in hospital, paderu government hospital
ప్రభుత్వ ఆస్పత్రిలో భూతవైద్యం, పాడేరు ప్రభుత్వ ఆస్పత్రి
ప్రభుత్వ ఆస్పత్రిలో భూత వైద్యం

ఆంధ్రప్రదేశ్​ విశాఖ జిల్లా హుకుంపేట మండలం రాపపంచాయతీ ఈదులగరువులో గెమ్మెలి ఆంబే బాంబే అనే మహిళకు జ్వరం వచ్చింది. చాలా రోజులు అవుతున్నా.. జ్వరం తగ్గడం లేదు. అంబులెన్స్​లో పాడేరు జిల్లా ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు. ఐదు రోజులైంది అయినా మార్పు లేదు. పరీక్షల్లో రోగం గురించి తెలియలేదు. రోజురోజుకీ ఆమె నీరసించిపోతోందని.. దెయ్యం పట్టినట్టు ఉంటుందని కుటుంబసభ్యులు అనుమానించారు.

ఆస్పత్రిలో భూతవైద్యం

ఏజెన్సీ కొండల్లో పూజలు చేసే మంత్రసానిని ఏకంగా ఆస్పత్రికే తీసుకొచ్చారు. ఆ వార్డులో అందరూ చూస్తుండగానే.. ఆ భూత వైద్యురాలు రోగి నాడి పట్టుకుని మంత్రాలు చదివేసింది. తోటి రోగులు అందరూ చూస్తుండగానే భూత వైద్యం పూర్తి చేసింది. మహిళకు శాంతి శాంతి అంటూ సపర్యలు చేసింది. ఇదంతా... ఎదురుగా మందుల కౌంటర్లో నర్సులు చూస్తూనే ఉన్నారు. అదే సమయంలో పురుషుల వార్డులో... వైద్యులు రోగులను పరీక్షిస్తున్నారు. ఆ భూత వైద్యురాలు.. బాధితురాలికి వైద్యం చేస్తూనే ఉంది.

పాడేరు ఏజెన్సీ పెద్దాస్పత్రిలో ఇలాంటి వాతావరణం విస్తుపోయేలా చేసింది. ఆధునిక కాలంలో ఇంకా ఇలాంటి తీరును ప్రజలు నమ్ముతుండడం.. కొందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా భూతవైద్యంతో బాగుపడతామని బాధితురాలి కుటుంబీకులు చెప్పడం.. తన వైద్యంతో బాధితురాలికి నయం అవుతుందని.. ఆ భూత వైద్యురాలు సైతం చెప్పడం.. ఆ ప్రాంతంలోని ప్రజల మానసిక స్థితిని తెలియజేస్తోంది.

ఐదు రోజుల నుంచి జ్వరం వస్తోంది. పరీక్షల్లో ఏం తెలియడం లేదు. చలి జ్వరం తగ్గడం లేదు. ఎన్ని రోజులున్నా ఫలితం లేదు. అయితే దెయ్యం లాంటిది పట్టిందని అనుకుంటున్నాం. దానికి పండు, ఫలాలు పెడితే తగ్గుతుందని నమ్ముతున్నాం. గతంలో ఇలా చేస్తే తగ్గింది.

-బాధితురాలి బంధువు

భూత వైద్యం చేస్తే జ్వరం తగ్గుతుంది. మాకు ఆ నమ్మకం ఉంది. ఆస్పత్రిలో చేసిన పరీక్షల్లో ఏం తేలడం లేదు. అందుకే ఊరికి తీసుకెళ్లి చేయిస్తాం. ఈరోజు పరీక్షలు చేయిస్తాం. అందులో ఏమన్నా తేలితే ఉంటాం. లేదంటే ఊరికి తీసుకెళ్లి భూతవైద్యం చేయిస్తాం.

-బాధితురాలి బంధువు

భూతవైద్యం చేస్తే చాలామందికి నయమైంది. దెయ్యం పడితే పేరుపెట్టి ఊదుతాం. అలా చేస్తే తగ్గుతుంది.

-భూత వైద్యురాలు

ఇదీ చదవండి: విషాదం: బట్టలు ఉతికేందుకు పెద్దలతో వెళ్లి..

ప్రభుత్వ ఆస్పత్రిలో భూత వైద్యం

ఆంధ్రప్రదేశ్​ విశాఖ జిల్లా హుకుంపేట మండలం రాపపంచాయతీ ఈదులగరువులో గెమ్మెలి ఆంబే బాంబే అనే మహిళకు జ్వరం వచ్చింది. చాలా రోజులు అవుతున్నా.. జ్వరం తగ్గడం లేదు. అంబులెన్స్​లో పాడేరు జిల్లా ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు. ఐదు రోజులైంది అయినా మార్పు లేదు. పరీక్షల్లో రోగం గురించి తెలియలేదు. రోజురోజుకీ ఆమె నీరసించిపోతోందని.. దెయ్యం పట్టినట్టు ఉంటుందని కుటుంబసభ్యులు అనుమానించారు.

ఆస్పత్రిలో భూతవైద్యం

ఏజెన్సీ కొండల్లో పూజలు చేసే మంత్రసానిని ఏకంగా ఆస్పత్రికే తీసుకొచ్చారు. ఆ వార్డులో అందరూ చూస్తుండగానే.. ఆ భూత వైద్యురాలు రోగి నాడి పట్టుకుని మంత్రాలు చదివేసింది. తోటి రోగులు అందరూ చూస్తుండగానే భూత వైద్యం పూర్తి చేసింది. మహిళకు శాంతి శాంతి అంటూ సపర్యలు చేసింది. ఇదంతా... ఎదురుగా మందుల కౌంటర్లో నర్సులు చూస్తూనే ఉన్నారు. అదే సమయంలో పురుషుల వార్డులో... వైద్యులు రోగులను పరీక్షిస్తున్నారు. ఆ భూత వైద్యురాలు.. బాధితురాలికి వైద్యం చేస్తూనే ఉంది.

పాడేరు ఏజెన్సీ పెద్దాస్పత్రిలో ఇలాంటి వాతావరణం విస్తుపోయేలా చేసింది. ఆధునిక కాలంలో ఇంకా ఇలాంటి తీరును ప్రజలు నమ్ముతుండడం.. కొందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా భూతవైద్యంతో బాగుపడతామని బాధితురాలి కుటుంబీకులు చెప్పడం.. తన వైద్యంతో బాధితురాలికి నయం అవుతుందని.. ఆ భూత వైద్యురాలు సైతం చెప్పడం.. ఆ ప్రాంతంలోని ప్రజల మానసిక స్థితిని తెలియజేస్తోంది.

ఐదు రోజుల నుంచి జ్వరం వస్తోంది. పరీక్షల్లో ఏం తెలియడం లేదు. చలి జ్వరం తగ్గడం లేదు. ఎన్ని రోజులున్నా ఫలితం లేదు. అయితే దెయ్యం లాంటిది పట్టిందని అనుకుంటున్నాం. దానికి పండు, ఫలాలు పెడితే తగ్గుతుందని నమ్ముతున్నాం. గతంలో ఇలా చేస్తే తగ్గింది.

-బాధితురాలి బంధువు

భూత వైద్యం చేస్తే జ్వరం తగ్గుతుంది. మాకు ఆ నమ్మకం ఉంది. ఆస్పత్రిలో చేసిన పరీక్షల్లో ఏం తేలడం లేదు. అందుకే ఊరికి తీసుకెళ్లి చేయిస్తాం. ఈరోజు పరీక్షలు చేయిస్తాం. అందులో ఏమన్నా తేలితే ఉంటాం. లేదంటే ఊరికి తీసుకెళ్లి భూతవైద్యం చేయిస్తాం.

-బాధితురాలి బంధువు

భూతవైద్యం చేస్తే చాలామందికి నయమైంది. దెయ్యం పడితే పేరుపెట్టి ఊదుతాం. అలా చేస్తే తగ్గుతుంది.

-భూత వైద్యురాలు

ఇదీ చదవండి: విషాదం: బట్టలు ఉతికేందుకు పెద్దలతో వెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.