ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Nov 1, 2020, 8:59 PM IST

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్​టెన్​ న్యూస్@9PM

1. ముగిసిన ప్రచార పర్వం

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దుబ్బాకలో తమ జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. దత్తత తీసుకున్న సీఎం

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిని దత్తత తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. నిన్న వాసాలమర్రిలో పర్యటించిన సీఎం రూ.100 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. గెలిచేందుకు భాజపా కుట్ర: కేటీఆర్

దుబ్బాక ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని భాజపా కుట్రలకు తెరలేపుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు . నైతికతను మరిచిన జాతీయ పార్టీ చిల్లరమల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కోటి డబ్బు..ఆ పార్టీ నేతదేనట!

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ హైదరాబాద్‌ నుంచి తరలిస్తున్న కోటి రూపాయల హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావు డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. బిహార్​లో ప్రచారానికి తెర

బిహార్​లో రెండో దశ పోలింగ్​ జరిగే ప్రాంతాల్లో ప్రచార పర్వం ముగిసింది. రెండో విడతలో భాగంగా నవంబర్​ 3న.. 94 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 27 మంది నక్సల్స్​ లొంగుబాటు

ఛత్తీస్​గఢ్​ దంతెవాడలో 27 మంది నక్సలైట్లు లొంగిపోయారు. అందులో ఆరుగురు మహిళలు ఉన్నారు. మావోయిస్టు భావజాలంతో విసుగు చెందే ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'సున్నా' కేసులు

ఐదు నెలల తర్వాత ఆస్ట్రేలియాలో తొలిసారిగా ఆదివారం ఒక్క కరోనా కేసు కూడా బయటపడలేదు. దేశవ్యాప్తంగా కరోనాతో ప్రభావితమైన విక్టోరియాలో వరుసగా రెండో రోజు ఎలాంటి కేసు నమోదుకాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'దీటుగా చైనా సైన్యం!'

ప్రపంచంపై ఆధిపత్యం కోసం పాకులాడుతున్న చైనా.. సైన్యాన్ని మరింత సమర్థంగా తయారుచేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2027 నాటికి అమెరికాకు దీటుగా సైన్యాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రణాళిక రచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. పంజాబ్ ఔట్

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 9 వికెట్ల తేడాతో చెన్నై సూపర్​కింగ్స్​ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో ఓటమి వల్ల రాహుల్​ సేన లీగ్​ దశలోనే టోర్నీ నుంచి వైదొలిగిన రెండో జట్టుగా నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. పవన్​ ఎంట్రీ​

చాలా నెలల తర్వాత 'వకీల్​సాబ్' సెట్​లో పవన్​ తిరిగి అడుగుపెట్టారు. ఆయనపై కీలక సన్నివేశాల్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తీశారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

1. ముగిసిన ప్రచార పర్వం

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దుబ్బాకలో తమ జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. దత్తత తీసుకున్న సీఎం

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిని దత్తత తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. నిన్న వాసాలమర్రిలో పర్యటించిన సీఎం రూ.100 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. గెలిచేందుకు భాజపా కుట్ర: కేటీఆర్

దుబ్బాక ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని భాజపా కుట్రలకు తెరలేపుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు . నైతికతను మరిచిన జాతీయ పార్టీ చిల్లరమల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కోటి డబ్బు..ఆ పార్టీ నేతదేనట!

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ హైదరాబాద్‌ నుంచి తరలిస్తున్న కోటి రూపాయల హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావు డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. బిహార్​లో ప్రచారానికి తెర

బిహార్​లో రెండో దశ పోలింగ్​ జరిగే ప్రాంతాల్లో ప్రచార పర్వం ముగిసింది. రెండో విడతలో భాగంగా నవంబర్​ 3న.. 94 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 27 మంది నక్సల్స్​ లొంగుబాటు

ఛత్తీస్​గఢ్​ దంతెవాడలో 27 మంది నక్సలైట్లు లొంగిపోయారు. అందులో ఆరుగురు మహిళలు ఉన్నారు. మావోయిస్టు భావజాలంతో విసుగు చెందే ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'సున్నా' కేసులు

ఐదు నెలల తర్వాత ఆస్ట్రేలియాలో తొలిసారిగా ఆదివారం ఒక్క కరోనా కేసు కూడా బయటపడలేదు. దేశవ్యాప్తంగా కరోనాతో ప్రభావితమైన విక్టోరియాలో వరుసగా రెండో రోజు ఎలాంటి కేసు నమోదుకాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'దీటుగా చైనా సైన్యం!'

ప్రపంచంపై ఆధిపత్యం కోసం పాకులాడుతున్న చైనా.. సైన్యాన్ని మరింత సమర్థంగా తయారుచేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2027 నాటికి అమెరికాకు దీటుగా సైన్యాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రణాళిక రచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. పంజాబ్ ఔట్

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 9 వికెట్ల తేడాతో చెన్నై సూపర్​కింగ్స్​ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో ఓటమి వల్ల రాహుల్​ సేన లీగ్​ దశలోనే టోర్నీ నుంచి వైదొలిగిన రెండో జట్టుగా నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. పవన్​ ఎంట్రీ​

చాలా నెలల తర్వాత 'వకీల్​సాబ్' సెట్​లో పవన్​ తిరిగి అడుగుపెట్టారు. ఆయనపై కీలక సన్నివేశాల్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తీశారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.