1. యాదాద్రి పనులపై కేసీఆర్ సమీక్ష
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. పునర్నిర్మాణ పనులు తుదిరూపుదాలుస్తున్న సందర్భంగా... దివ్యమైన అలంకృత రూపం కార్యాచరణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ముగిసిన ఎన్నికల ప్రచారం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ నేపథ్యంలో 48 గంటల ముందు ప్రచారం పరిసమాప్తమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కేటీఆర్ను కలిసిన పోరాట కమిటీ
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు మద్దతు పలికినందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ... మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'పోలింగ్కు ఏర్పాట్లు'
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం
ఒడిశాలో భాజపా ఎమ్మెల్యే సుభాశ్ పాణిగ్రాహి.. అసెంబ్లీలోనే శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'దేశం బందీ అవుతోంది'
దండి మార్చ్ ఉద్యమానికి నేటితో 91 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేశారు. కొందరు నాయకుల చేతిలో దేశం బందీ అయిందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. మోసపోయి.. 1200 కి.మీ. నడక
ఝార్ఖండ్కు చెందిన ఓ వ్యక్తి.. దిల్లీ నుంచి 1200 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తామని.. అతడ్ని దిల్లీ తీసుకెళ్లిన కొందరు ఏజెంట్లు మోసం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. మరోసారి తగ్గిన బంగారం, వెండి
బంగారం, వెండి ధరలు శుక్రవారం దిగొచ్చాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.291 తగ్గింది. వెండి ధర కిలోకు భారీగా రూ.1,096 తగ్గి.. రూ.65,958 దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. టీ20కి ప్రేక్షకుల అనుమతి
నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 సిరీస్కు.. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించనున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'వైల్డ్ డాగ్' ట్రైలర్
'వైల్డ్డాగ్' ట్రైలర్, సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. దీనిని సామాజిక మాధ్యమాల వేదికగా చిరు విడుదల చేశారు. ఏప్రిల్ 2న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.