ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @5PM

author img

By

Published : Feb 27, 2021, 5:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్ న్యూస్ @5PM

1. 'కరోనా అదుపులోనే ఉంది'

రాష్ట్రంలో కరోనా పూర్తి స్థాయిలో అదుపులో ఉందని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ తెలిపారు. కేంద్ర కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. బిట్టు శ్రీను కస్టడీకి కోర్టు అనుమతి

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో జరిగిన వామన్​ రావు దంపతుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనును వారం పాటు పోలీసు​ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో బిట్టు శ్రీను ఎ-4గా ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. పేదలంటే లెక్కలేదు: అర్వింద్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైమదీబజార్​లో ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరుతో దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న పేదలను ఖాళీ చేయించాలని నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. వామన్‌రావు కుటుంబానికి కాంగ్రెస్ పరామర్శ

న్యాయవాదుల హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్​ నేతలు డిమాండ్​ చేశారు. వామన్​రావు స్వగ్రామం గుంజపడుగులో కుటుంబసభ్యులను ఎమ్మెల్యే శ్రీధర్​బాబుతో కలిసి పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ పరామర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. భారత ఆర్మీలో గూఢచారి

జమ్ము కశ్మీర్ ఉధంపుర్​లోని ఆర్మీ నార్తర్న్ కమాండ్​ నుంచి ఓ జవాను డేటాను తస్కరించాడు. దీన్ని పాకిస్థాన్​కు చెందిన ఐఎస్ఐ ప్రతినిధులకు అందజేశాడు. దీనిపై లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. భాజపా, అన్నాడీఎంకే భేటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, అన్నాడీఎంకే కలిసి పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి, రాష్ట్ర భాజపా ఎన్నికల ఇంఛార్జి కిషన్​ రెడ్డి, ముఖ్యమంత్రి పళనిస్వామితో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'రెండేళ్ల వరకైనా ఉద్యమం చేస్తాం'

సాగు చట్టాల రద్దు కోసం రెండేళ్ల వరకైనా ఉద్యమం కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు భారతీయ కిసాన్ ‌యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్​ టికాయిత్​. ప్రభుత్వం.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'భారత్​కే అధికారం'

బంగ్లాదేశ్​లో తలదాచుకుంటున్న 11 లక్షల మంది రోహింగ్యాలను స్వస్థలానికి పంపించే తీర్మానంలో ఎక్కువ అధికారం భారత్​కే ఉందని ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్​ తిరుమూర్తి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. సౌతాఫ్రికాతో వన్డే, టీ20లకు జట్లు

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్​లకు భారత మహిళల జట్టును ప్రకటించింది యాజమాన్యం. మార్చి 7 నుంచి వన్డే సిరీస్​ ప్రారంభం కానుండగా.. మార్చి 20 నుంచి పొట్టి ఫార్మాట్​ మొదలవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'నవ్వించడమే ధ్యేయం'

సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా చిత్రవిశేషాల్ని పంచుకుంది 'జాతిరత్నాలు' బృందం. ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

1. 'కరోనా అదుపులోనే ఉంది'

రాష్ట్రంలో కరోనా పూర్తి స్థాయిలో అదుపులో ఉందని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ తెలిపారు. కేంద్ర కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. బిట్టు శ్రీను కస్టడీకి కోర్టు అనుమతి

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో జరిగిన వామన్​ రావు దంపతుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనును వారం పాటు పోలీసు​ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో బిట్టు శ్రీను ఎ-4గా ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. పేదలంటే లెక్కలేదు: అర్వింద్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైమదీబజార్​లో ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరుతో దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న పేదలను ఖాళీ చేయించాలని నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. వామన్‌రావు కుటుంబానికి కాంగ్రెస్ పరామర్శ

న్యాయవాదుల హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్​ నేతలు డిమాండ్​ చేశారు. వామన్​రావు స్వగ్రామం గుంజపడుగులో కుటుంబసభ్యులను ఎమ్మెల్యే శ్రీధర్​బాబుతో కలిసి పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ పరామర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. భారత ఆర్మీలో గూఢచారి

జమ్ము కశ్మీర్ ఉధంపుర్​లోని ఆర్మీ నార్తర్న్ కమాండ్​ నుంచి ఓ జవాను డేటాను తస్కరించాడు. దీన్ని పాకిస్థాన్​కు చెందిన ఐఎస్ఐ ప్రతినిధులకు అందజేశాడు. దీనిపై లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. భాజపా, అన్నాడీఎంకే భేటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, అన్నాడీఎంకే కలిసి పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి, రాష్ట్ర భాజపా ఎన్నికల ఇంఛార్జి కిషన్​ రెడ్డి, ముఖ్యమంత్రి పళనిస్వామితో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'రెండేళ్ల వరకైనా ఉద్యమం చేస్తాం'

సాగు చట్టాల రద్దు కోసం రెండేళ్ల వరకైనా ఉద్యమం కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు భారతీయ కిసాన్ ‌యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్​ టికాయిత్​. ప్రభుత్వం.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'భారత్​కే అధికారం'

బంగ్లాదేశ్​లో తలదాచుకుంటున్న 11 లక్షల మంది రోహింగ్యాలను స్వస్థలానికి పంపించే తీర్మానంలో ఎక్కువ అధికారం భారత్​కే ఉందని ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్​ తిరుమూర్తి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. సౌతాఫ్రికాతో వన్డే, టీ20లకు జట్లు

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్​లకు భారత మహిళల జట్టును ప్రకటించింది యాజమాన్యం. మార్చి 7 నుంచి వన్డే సిరీస్​ ప్రారంభం కానుండగా.. మార్చి 20 నుంచి పొట్టి ఫార్మాట్​ మొదలవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'నవ్వించడమే ధ్యేయం'

సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా చిత్రవిశేషాల్ని పంచుకుంది 'జాతిరత్నాలు' బృందం. ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.