ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్​@1PM

author img

By

Published : Jul 19, 2021, 12:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్ న్యూస్​@1PM
టాప్​ టెన్ న్యూస్​@1PM

తొలి రోజే దుమారం

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్​సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ప్రధాని మోదీ ప్రసంగానికి సైతం సభ్యులు అడ్డుతగిలారు. మరోవైపు, ప్రముఖుల మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ.. రాజ్యసభ వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అర్థవంతమైన చర్చ జరగాలి..

పార్లమెంట్ సమావేశాల్లో అర్థవంతమైన, నిర్మాణాత్మక చర్చలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. విపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇస్తుందని తెలిపారు. ప్రజలందరూ టీకా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

స్పీకర్​కు రేవంత్​ ఫిర్యాదు

కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ భూములను సందర్శించాలని నిర్ణయించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు కోకాపేట వెళ్లనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రజాక్షేత్రంలోకి రాజేందర్​

కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి భాజపా నేత ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభమైంది. ప్రజా దీవెన యాత్ర పేరుతో 270 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ప్రారంభానికి ముందు ఈటల సతీమణి జమున వీరతిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జగన్​ పోలవరం పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పోలవరంలో పర్యటిస్తున్నారు. ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఘోరప్రమాదం

పాకిస్థాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 30 మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. పంజాబ్​ ప్రావిన్సులోని డేరా ఘాజీ ఖాన్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉగ్ర ఏరివేత

నాలుగురోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో 967 మంది తాలిబన్లను అఫ్గాన్ సైన్యం మట్టుబెట్టింది. మరో 500మందికి పైగా తాలిబన్లను గాయపరిచింది. మరోవైపు.. తాలిబన్లకు, అఫ్గాన్​ ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించటం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తగ్గిన పసిడి ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. కేజీ వెండి ధర రూ.70 వేలకు చేరింది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అందుకే సెంచరీ చేయలేదు..

శ్రీలంకతో తొలి వన్డేలో టీమ్​ఇండియా గెలవడంపై కెప్టెన్ ధావన్(Sikhar Dhawan) ఆనందం వ్యక్తం చేశాడు​. ఈ మ్యాచ్​లో సెంచరీ చేయాలని అనుకున్న కుదర్లేదని అన్నాడు. పృథ్వీషా, ఇషాన్ కిషన్​లపై ప్రశంసలు కురిపించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సంగీత దర్శకుడు ఫిక్స్​

రామ్​చరణ్​-శంకర్​ సినిమాకు సంగీత దర్శకుడిని ఎంపిక చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి రికార్డింగ్​ కూడా పూర్తి చేసినట్లు వెల్లడించారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తొలి రోజే దుమారం

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్​సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ప్రధాని మోదీ ప్రసంగానికి సైతం సభ్యులు అడ్డుతగిలారు. మరోవైపు, ప్రముఖుల మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ.. రాజ్యసభ వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అర్థవంతమైన చర్చ జరగాలి..

పార్లమెంట్ సమావేశాల్లో అర్థవంతమైన, నిర్మాణాత్మక చర్చలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. విపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇస్తుందని తెలిపారు. ప్రజలందరూ టీకా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

స్పీకర్​కు రేవంత్​ ఫిర్యాదు

కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ భూములను సందర్శించాలని నిర్ణయించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు కోకాపేట వెళ్లనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రజాక్షేత్రంలోకి రాజేందర్​

కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి భాజపా నేత ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభమైంది. ప్రజా దీవెన యాత్ర పేరుతో 270 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ప్రారంభానికి ముందు ఈటల సతీమణి జమున వీరతిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జగన్​ పోలవరం పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పోలవరంలో పర్యటిస్తున్నారు. ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఘోరప్రమాదం

పాకిస్థాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 30 మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. పంజాబ్​ ప్రావిన్సులోని డేరా ఘాజీ ఖాన్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉగ్ర ఏరివేత

నాలుగురోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో 967 మంది తాలిబన్లను అఫ్గాన్ సైన్యం మట్టుబెట్టింది. మరో 500మందికి పైగా తాలిబన్లను గాయపరిచింది. మరోవైపు.. తాలిబన్లకు, అఫ్గాన్​ ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించటం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తగ్గిన పసిడి ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. కేజీ వెండి ధర రూ.70 వేలకు చేరింది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అందుకే సెంచరీ చేయలేదు..

శ్రీలంకతో తొలి వన్డేలో టీమ్​ఇండియా గెలవడంపై కెప్టెన్ ధావన్(Sikhar Dhawan) ఆనందం వ్యక్తం చేశాడు​. ఈ మ్యాచ్​లో సెంచరీ చేయాలని అనుకున్న కుదర్లేదని అన్నాడు. పృథ్వీషా, ఇషాన్ కిషన్​లపై ప్రశంసలు కురిపించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సంగీత దర్శకుడు ఫిక్స్​

రామ్​చరణ్​-శంకర్​ సినిమాకు సంగీత దర్శకుడిని ఎంపిక చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి రికార్డింగ్​ కూడా పూర్తి చేసినట్లు వెల్లడించారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.