ETV Bharat / city

BLACK MARKET: బ్లాక్​ఫంగస్​ డ్రగ్​ను అమ్ముకున్న ప్రభుత్వ వైద్యుడు

author img

By

Published : Jun 3, 2021, 9:21 PM IST

Updated : Jun 3, 2021, 10:08 PM IST

బ్లాక్ ఫంగస్​తో సతమతమవుతున్న ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు వ్యక్తులు వాటిని అధిక ధరలకు అమ్మడంతో పాటు నకిలీవి కూడా సృష్టిస్తున్నారు. ఈ తతంగంలో ప్రభుత్వ వైద్యులే ప్రధాన పాత్ర పోషిస్తుండటం విచారకరం. అంబిలాన్​ 50 ఎంజీ డ్రగ్​ను అధిక ధరలకు అమ్ముతున్న ముగ్గురు అక్రమార్కులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

esi hospital doctor selling black fungus drug in black market
esi hospital doctor selling black fungus drug in black market



హైదరాబాద్ ప్రగతినగర్​లో ఉండే సెలన్ లేబరేటరీస్ సంస్థ బ్లాక్ ఫంగస్ డ్రగ్ అంబిలాన్ 50 ఎంజీని ఎర్రగడ్డలోని ఈఎస్​ఐ ఆసుపత్రికి సరఫరా చేస్తుంది. ఆసుపత్రిలో ఉన్న రోగులకు డ్రగ్ ఇవ్వకుండా... ఈఎస్ఐ ఆస్పత్రిలో విధులు నిర్వహించే ప్రభుత్వ వైద్యుడు ఓబుల్ రెడ్డి తప్పుదారి పట్టించాడు. చింతల్​లోని నందిని మెడికల్ దుకాణం యజమాని వికాస్​రెడ్డికి అధిక ధరకు అమ్ముకున్నాడు. వికాస్ రెడ్డి కొంత లాభంతో మధ్యవర్తి అయిన నాగరాజు ద్వారా సుచిత్రకు చెందిన మానస మెడికల్ దుకాణ నిర్వాహకుడు శ్రీధర్​కు అమ్ముకున్నాడు.

ఈ డ్రగ్​ను శ్రీధర్​.. 5 నుంచి 10వేల లాభంతో అమ్మడంతో పాటు నకిలీవి సృష్టించాలని నిర్ణయించాడు. ఆన్​లైన్​లో సర్చ్ చేసి ఒరిజినల్ డ్రగ్ సీసాను పోలి ఉండే విధంగా తక్కువ ధరలో ఉండే మరో యాంటీబయోటిక్ డ్రగ్ ఎంచుకున్నాడు. ఆ సీసకున్న లేబుల్ తీసేశాడు. ఒరిజినల్ అంబిలాన్ స్టిక్కర్లను అతికించి... విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాడు. ఈ సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు దాడి చేశారు. తయారు చేసిన డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. వికాస్​రెడ్డి, నాగరాజు, శ్రీధర్​ను అదుపులోకి తీసుకుని... విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడైన ఈఎస్ఐ వైద్యుడు ఓబుల్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు మూడున్నర లక్షలు ఉంటుందని తెలిపారు. వీటితో పాటు ఓ కారు, ఓ ద్విచక్రవాహనం, 4 ఫోన్లు, 5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Telangana Council: ప్రొటెం ఛైర్మన్​గా ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డి



హైదరాబాద్ ప్రగతినగర్​లో ఉండే సెలన్ లేబరేటరీస్ సంస్థ బ్లాక్ ఫంగస్ డ్రగ్ అంబిలాన్ 50 ఎంజీని ఎర్రగడ్డలోని ఈఎస్​ఐ ఆసుపత్రికి సరఫరా చేస్తుంది. ఆసుపత్రిలో ఉన్న రోగులకు డ్రగ్ ఇవ్వకుండా... ఈఎస్ఐ ఆస్పత్రిలో విధులు నిర్వహించే ప్రభుత్వ వైద్యుడు ఓబుల్ రెడ్డి తప్పుదారి పట్టించాడు. చింతల్​లోని నందిని మెడికల్ దుకాణం యజమాని వికాస్​రెడ్డికి అధిక ధరకు అమ్ముకున్నాడు. వికాస్ రెడ్డి కొంత లాభంతో మధ్యవర్తి అయిన నాగరాజు ద్వారా సుచిత్రకు చెందిన మానస మెడికల్ దుకాణ నిర్వాహకుడు శ్రీధర్​కు అమ్ముకున్నాడు.

ఈ డ్రగ్​ను శ్రీధర్​.. 5 నుంచి 10వేల లాభంతో అమ్మడంతో పాటు నకిలీవి సృష్టించాలని నిర్ణయించాడు. ఆన్​లైన్​లో సర్చ్ చేసి ఒరిజినల్ డ్రగ్ సీసాను పోలి ఉండే విధంగా తక్కువ ధరలో ఉండే మరో యాంటీబయోటిక్ డ్రగ్ ఎంచుకున్నాడు. ఆ సీసకున్న లేబుల్ తీసేశాడు. ఒరిజినల్ అంబిలాన్ స్టిక్కర్లను అతికించి... విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాడు. ఈ సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు దాడి చేశారు. తయారు చేసిన డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. వికాస్​రెడ్డి, నాగరాజు, శ్రీధర్​ను అదుపులోకి తీసుకుని... విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడైన ఈఎస్ఐ వైద్యుడు ఓబుల్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు మూడున్నర లక్షలు ఉంటుందని తెలిపారు. వీటితో పాటు ఓ కారు, ఓ ద్విచక్రవాహనం, 4 ఫోన్లు, 5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Telangana Council: ప్రొటెం ఛైర్మన్​గా ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డి

Last Updated : Jun 3, 2021, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.