వేతనసవరణ సంఘం పూర్తి నివేదిక బయటకు పొక్కడంపై సచివాలయంలో అంతర్గత విచారణ జరుగుతోంది. చర్చల కోసం ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదిక సారాంశాన్ని మంగళవారం రాత్రి ఇచ్చారు. అయితే ఈ ఉదయం నివేదిక పూర్తిగా బయటకు వచ్చింది.
అధికారికంగా ఇవ్వకముందే పూర్తి నివేదిక బయటకు రావడంపై ఉన్నతాధికారులు పూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ నుంచి బయటకు వచ్చిందో తేల్చేందుకు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: 43 శాతం ఫిట్మెంట్ కంటే తగ్గకుండా ఇవ్వాలి : ఉద్యోగ సంఘాలు