ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో గురువారం మత్స్యకారులకు భారీ ట్యూనా చేప దొరికింది. ఏడు అడుగుల పొడవు, ఎనభై కిలోల బరువున్న ఈ ట్యూనా చేపను ఒడ్డుకు చేర్చడానికి వారు తీవ్రంగా శ్రమించారు.
ఓ వ్యాపారి ఈ చేపను ఏడు వేల రూపాయలకు కొనుగోలు చేసి.. కేరళకు ఎగుమతి చేశాడు. ఇంత భారీ చేప ఉప్పాడ చేపలరేవులో దొరకడంతో సందర్శకులు ఫొటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు.
- ఇదీ చూడండి : రంగురంగుల గుడారాలు.. గోవాలో కాదు విశాఖ బీచ్లోనే