ETV Bharat / city

"స్థానికేతరులంతా హుజూర్​నగర్​ వదిలివెళ్లాలి"

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ నియోజకవర్గ శాసనసభ ఉపఎన్నిక ప్రచార గడువు మరో రెండు గంటల్లో ముగియనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఈసీ స్పష్టం చేసింది.

author img

By

Published : Oct 19, 2019, 3:09 PM IST

హుజూర్​నగర్​ ఉపఎన్నిక 2019

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ ఉపఎన్నిక ప్రచార గడువు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. స్థానికేతరులంతా నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలు తనిఖీ చేయాలని పోలీసులను సీఈవో రజత్​కుమార్​ ఆదేశించారు. నియోజకవర్గ, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అనుమానం వచ్చినా సదరు వ్యక్తుల గుర్తింపు పత్రాలను పరిశీలించాలని సూచించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి ఏజెంట్ల దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ ఉపఎన్నిక ప్రచార గడువు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. స్థానికేతరులంతా నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలు తనిఖీ చేయాలని పోలీసులను సీఈవో రజత్​కుమార్​ ఆదేశించారు. నియోజకవర్గ, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అనుమానం వచ్చినా సదరు వ్యక్తుల గుర్తింపు పత్రాలను పరిశీలించాలని సూచించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి ఏజెంట్ల దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

 19-10-2019 TG_HYD_60_19_HUZURNAGAR_CAMPAIGN_5PM_CLOSE_DRY_3038200 REPORTER : MALLIK.B ( ) సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ శాసనసభ నియోజవర్గ ఉప ఎన్నిక ప్రచార గడువు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఐదు గంటల తరువాత ఎలాంటి ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఈసీ స్పష్టం చేసింది. స్థానికేతరులందరూ హుజూర్‌నగర్‌ నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జీలు, అతిధి గృహాలు తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. స్థానికేతరులు ఉంటే తగు చర్యలు తీసుకోవాలని... తక్షణమే పంపించి వేయాలని ఈసీ స్పష్టం చేసింది. నియోజకవర్గ, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుమానం వచ్చినా సదరు వ్యక్తుల గుర్తింపు పత్రాలను పరిశీలించాలని ఈసీ సూచించింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి ఏజెంట్ల దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు. DRY............
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.