ETV Bharat / city

బైక్​పై ఒకరు... కారులో ఇద్దరు... అంతే: సీఎస్

author img

By

Published : Mar 23, 2020, 11:37 PM IST

రాత్రి ఏడు నుంచి ఉదయం ఆరు వరుకు అత్యవసర సేవలు మినహా మరే ఇతర కారణాలతో రోడ్లమీదకు అనుమతించేదే లేదని సీఎస్​ తెల్చిచెప్పారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో కీలక సూచనలు చేశారు. నిత్యవసరాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు.

collectors
అధిక ధరలపై ఉక్కుపాదం మోపండి: సీఎస్​

ఈ నెల 31 వరకు ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​ను పకడ్భందిగా అమలు చేయాలని.. జారీ చేసిన జీవోలు పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. లాక్​డౌన్​పై వీడియో కాన్ఫిరెన్స్​ నిర్వహించిన సీఎస్​..ద్విచక్ర వాహనంపై ఒకరు, ఫోర్ వీలర్స్​లో ఇద్దరికి మించకుండా అనుమతించాలని సూచించారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల లోపు అత్యవసర వైద్య చికిత్స మినహా.. ఏ కారణంతో కూడా రోడ్లపైకి అనుమతించరాదన్నారు.

అధిక ధరలపై..

నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అధిక ధరలపై ఉక్కుపాదం మోపాలని తేల్చిచెప్పారు. చెక్​పోస్ట్​ల వద్ద నిత్యావసర వస్తువుల రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. సచివాలయంలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌ అధికారులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. వీరు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తారని తెలిపారు.

ప్రత్యేక యాప్​..

ఇదే తరహాలో జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో కనీసం రెండు క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. రోజువారి నివేదికలు కంట్రోల్ రూమ్​కు పంపాలన్నారు. జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించడానికి ప్రత్యేక యాప్​ను రూపొందిచాలన్నారు.

ఇవీ చూడండి: 'అధిక ధరలకు విక్రయిస్తే ఆ నంబర్​కు కాల్​ చేయండి'

ఈ నెల 31 వరకు ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​ను పకడ్భందిగా అమలు చేయాలని.. జారీ చేసిన జీవోలు పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. లాక్​డౌన్​పై వీడియో కాన్ఫిరెన్స్​ నిర్వహించిన సీఎస్​..ద్విచక్ర వాహనంపై ఒకరు, ఫోర్ వీలర్స్​లో ఇద్దరికి మించకుండా అనుమతించాలని సూచించారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల లోపు అత్యవసర వైద్య చికిత్స మినహా.. ఏ కారణంతో కూడా రోడ్లపైకి అనుమతించరాదన్నారు.

అధిక ధరలపై..

నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అధిక ధరలపై ఉక్కుపాదం మోపాలని తేల్చిచెప్పారు. చెక్​పోస్ట్​ల వద్ద నిత్యావసర వస్తువుల రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. సచివాలయంలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌ అధికారులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. వీరు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తారని తెలిపారు.

ప్రత్యేక యాప్​..

ఇదే తరహాలో జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో కనీసం రెండు క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. రోజువారి నివేదికలు కంట్రోల్ రూమ్​కు పంపాలన్నారు. జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించడానికి ప్రత్యేక యాప్​ను రూపొందిచాలన్నారు.

ఇవీ చూడండి: 'అధిక ధరలకు విక్రయిస్తే ఆ నంబర్​కు కాల్​ చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.