జైళ్లలో మగ్గుతున్న జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేల సంఖ్యలో ఖైదీలు జైళ్లల్లో ఉండిపోయారని... అక్కడ కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశాలుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంత వరకు ఖైదీలకు క్షమాభిక్ష పెట్టలేదని గుర్తు చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని 200 రోజులుగా జరుగుతున్న పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ