ఏపీలో 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 18-45 మధ్య ఉన్నవారికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2 కోట్ల 4 లక్షల మందికి పైగా కొవిడ్ ఉచిత టీకా ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.
మే 1 నుంచి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా కట్టడిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వైరస్ సోకినా.. కొవిడ్ రోగుల సేవలో వైద్యులు