ETV Bharat / city

చేపల మార్కెట్​ వద్ద సందడి.. పోలీసుల ప్రత్యేక దృష్టి

author img

By

Published : May 23, 2021, 10:53 AM IST

కరోనా వ్యాప్తి కట్టడికి లాక్​డౌన్ విధించినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిబంధనలు పక్కాగా అమలవ్వడం లేదు. ముఖ్యంగా మార్కెట్​కు ప్రజలు గుంపులుగుంపులుగా తరలిరావడం వల్ల వైరస్ వాహకాలుగా మారుతున్నారు. హైదరాబాద్​లోని ముషీరాబాద్​ చేపల మార్కెట్​కు ఆదివారం కావడం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

fish market , rush at fish market
చేపల మార్కెట్, ముషీరాబాద్ చేపల మార్కెట్

రాష్ట్రంలో లాక్​డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ముఖ్యంగా మార్కెట్లలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. ఆదివారం కావడం వల్ల హైదరాబాద్​లోని ముషీరాబాద్ చేపల మార్కెట్​కు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.

corona rules violation at musheerabad fish market in Hyderabad
ముషీరాబాద్ చేపల మార్కెట్​లో రద్దీ

కొద్దిరోజులుగా మార్కెట్​ వద్ద కరోనా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లోనే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని తెలిపారు. అధికారులు చొరవ చూపి ప్రజలు గుమిగూడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

fish market , rush at fish market
చేపల మార్కెట్, ముషీరాబాద్ చేపల మార్కెట్

మార్కెట్​లో కరోనా నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని.. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో.. ముషీరాబాద్ చేపల మార్కెట్​పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయం 5 గంటల నుంచి మార్కెట్​కు వచ్చే వాహనాలను బయటే నిలిపివేశారు. భౌతిక దూరం పాటించని కొనుగోలుదారులను, నిబంధనలు ఉల్లంఘించిన విక్రయదారులను హెచ్చరించిన పోలీసులు జరిమానా విధించారు.

రాష్ట్రంలో లాక్​డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ముఖ్యంగా మార్కెట్లలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. ఆదివారం కావడం వల్ల హైదరాబాద్​లోని ముషీరాబాద్ చేపల మార్కెట్​కు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.

corona rules violation at musheerabad fish market in Hyderabad
ముషీరాబాద్ చేపల మార్కెట్​లో రద్దీ

కొద్దిరోజులుగా మార్కెట్​ వద్ద కరోనా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లోనే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని తెలిపారు. అధికారులు చొరవ చూపి ప్రజలు గుమిగూడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

fish market , rush at fish market
చేపల మార్కెట్, ముషీరాబాద్ చేపల మార్కెట్

మార్కెట్​లో కరోనా నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని.. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో.. ముషీరాబాద్ చేపల మార్కెట్​పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయం 5 గంటల నుంచి మార్కెట్​కు వచ్చే వాహనాలను బయటే నిలిపివేశారు. భౌతిక దూరం పాటించని కొనుగోలుదారులను, నిబంధనలు ఉల్లంఘించిన విక్రయదారులను హెచ్చరించిన పోలీసులు జరిమానా విధించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.