ETV Bharat / city

అర్హుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం : మారెడ్డి శ్రీనివాసరెడ్డి - ఉచిత బియ్యం

లాక్​డౌన్​ కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ప్రకటించిన కరోనా సాయం ఖాతాల్లో జమ చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. ఏప్రిల్​, మే రెండు నెలలకు కలిపి రెండు లక్షల మందికి రూ.63 కోట్ల 40 లక్షలు ఖాతాల్లో వేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

Corona Help Amount Will Credited In Beneficiary Accounts
అర్హుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం : మారెడ్డి సంజీవరెడ్డి
author img

By

Published : May 24, 2020, 12:07 AM IST

Updated : May 24, 2020, 9:12 AM IST

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి లేక ప్రజలు తిండికి ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం అర్హులందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. ఉచిత బియ్యంతో పాటు.. ఖాతాలో రూ.1500 కూడా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్​, మే నెలల్లో రెండుసార్లు ఉచిత బియ్యం తీసుకున్న వారికి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. రెండు నెలలకు కలిపి రూ.3వేలు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. మొత్తం రెండు లక్షల ఎనిమిది వేల మంది అర్హులకు నగదు సాయం అందనున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు రూ. 62 కోట్ల 40 లక్షల ప్రజల ఖాతాల్లో వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

ఏప్రిల్​ నెలలో 74.07 లక్షలు, మే నెలలో 74.35 లక్షల కార్డుదారులకు బ్యాంకుల ద్వారా నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. బ్యాంకు ఖాతాలు లేని లబ్ధిదారులకు ఏప్రిల్​ నెలలో 5.21 లక్షల మంది, మే నెలలో 5.38 లక్షల మందికి పోస్టాఫీసుల ద్వారా 158.24 కోట్లు అందజేసినట్టు శ్రీనివాస్​ రెడ్డి వివరించారు. ఇప్పటి వరకు 81.49 లక్షల మంది కార్డుదారులకు 3 లక్షల 25వేల మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని, 5187 మెట్రిక్​ టన్నుల కందిపప్పు పంపిణీ చేశామని తెలిపారు.

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి లేక ప్రజలు తిండికి ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం అర్హులందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. ఉచిత బియ్యంతో పాటు.. ఖాతాలో రూ.1500 కూడా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్​, మే నెలల్లో రెండుసార్లు ఉచిత బియ్యం తీసుకున్న వారికి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. రెండు నెలలకు కలిపి రూ.3వేలు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. మొత్తం రెండు లక్షల ఎనిమిది వేల మంది అర్హులకు నగదు సాయం అందనున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు రూ. 62 కోట్ల 40 లక్షల ప్రజల ఖాతాల్లో వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

ఏప్రిల్​ నెలలో 74.07 లక్షలు, మే నెలలో 74.35 లక్షల కార్డుదారులకు బ్యాంకుల ద్వారా నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. బ్యాంకు ఖాతాలు లేని లబ్ధిదారులకు ఏప్రిల్​ నెలలో 5.21 లక్షల మంది, మే నెలలో 5.38 లక్షల మందికి పోస్టాఫీసుల ద్వారా 158.24 కోట్లు అందజేసినట్టు శ్రీనివాస్​ రెడ్డి వివరించారు. ఇప్పటి వరకు 81.49 లక్షల మంది కార్డుదారులకు 3 లక్షల 25వేల మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని, 5187 మెట్రిక్​ టన్నుల కందిపప్పు పంపిణీ చేశామని తెలిపారు.

ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు

Last Updated : May 24, 2020, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.