ETV Bharat / city

కరోనా మరణాలకు కారణాలవే.. కట్టడి చేయటం ఎలా?

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మొత్తం కరోనా మృతుల్లో 50 ఏళ్లు పైబడినవారే  దాదాపు 68శాతం ఉన్నట్లుగా గణాంకాలను పరిశీలిస్తే వెల్లడవుతోంది. కరోనా మరణాలను విశ్లేషిస్తే.. ప్రధానంగా రెండు రకాల కారణాలను వైద్యులు గుర్తించారు.

author img

By

Published : Jun 8, 2020, 10:12 AM IST

corona deaths can be stopped by taking safety measures
కరోనా మరణాల కట్టడి ఇలా!
  • 54 ఏళ్ల వ్యక్తిలో జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించాయి. నాలుగైదు రోజులు సొంతంగా మందులు వాడారు. లక్షణాలు చేయిదాటి, తీవ్ర శ్వాసకోశ సమస్యకు దారితీసింది. గాంధీ ఆసుపత్రికి తరలిస్తే కరోనాగా నిర్ధారించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందారు.
  • 43 ఏళ్ల మహిళ అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారు. మూత్రపిండాల వైఫల్య జబ్బుకు చికిత్స పొందుతున్నారు. కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు.

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. కొవిడ్ మరణాలూ పెరుగుతున్నాయి. కరోనా మరణాలను విశ్లేషిస్తే.. ప్రధానంగా రెండు కారణాలను వైద్యులు గుర్తించారు. మొదటిది అత్యధికుల్లో కరోనాతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, గుండెజబ్బు, మూత్రపిండాల వైఫల్యం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి.. తదితర అనుబంధ అనారోగ్య సమస్యలు ఉండటం. రెండోది కరోనా లక్షణాలను గుర్తించినా ఆలస్యంగా చికిత్సకు వచ్చినవారిలో మరణాల రేటు అధికంగా ఉండటం.

ఎక్కువ కేసులు నమోదైతే తదనుగుణంగా మరణాల సంఖ్యా హెచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. అసలు వైరస్‌ బారినపడడాన్ని తగ్గించగలిగితే మృతుల సంఖ్య కూడా తగ్గుతుంది. అందుకే వైరస్‌ వ్యాప్తి కట్టడికి విస్తృత ప్రచారం కల్పిస్తూనే.. మరణాలకు కారణాలైన ఆ రెంటిపైనా ప్రధానంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్లాస్మాథెరపీతో పాటు యాంటీ వైరల్‌ ఔషధాలను సైతం చికిత్సకు వినియోగించాలని ఆదివారం మంత్రి ఈటల నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆరోగ్యశాఖ తీర్మానించింది.

స్వేచ్ఛ కన్నా ప్రాణాలే ప్రధానం

రాష్ట్రంలో శనివారం 10 మంది కరోనాతో చనిపోగా, ఆదివారం ఆ సంఖ్య మరింత పెరిగి 14కు చేరింది. ఈ నెలలోనే ఇప్పటి వరకూ 55 మంది కొవిడ్‌తో మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించగానే.. స్వేచ్ఛను దుర్వినియోగం చేసే తీరు పెచ్చుపెరిగింది. ఫలితంగా వైరస్‌ వ్యాప్తీ వేగంగా జరుగుతోంది.

బయటకు వెళ్లొచ్చేవారి వల్ల ఇంట్లో ఉంటున్న వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు వైరస్‌ బారినపడుతున్నారు. వీరిలోనూ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించకపోవడం, సత్వర చికిత్స పొందకపోవడం ప్రాణాంతకమవుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మూణ్నాలుగు రోజులు ఆలస్యం చేసినా.. కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లో విధ్వంసం సృష్టిస్తోందని హెచ్చరిస్తున్నారు. ఆదివారం చనిపోయిన వారిలోనూ పది మందికి నిమోనియా లక్షణాలతో పాటు ఊపిరితిత్తులు వైఫల్యం చెందినట్లుగా వైద్యనివేదికల్లో పేర్కొనడం గమనార్హం. వీరిలో అధికులు ఆసుపత్రిలో చేరిన స్వల్పకాలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

కోలుకునేవారే అధికం

రాష్ట్రంలో మరణాల కంటే కోలుకునే వారే అధికంగా ఉన్నారు. మొత్తం కరోనా బాధితుల్లో మరణాల శాతం సుమారు 3 కాగా, కరోనా బారినపడినవారిలో వయసుల వారీగా పరిశీలించినా.. 60-69 ఏళ్ల వారిలోనూ 90.7 శాతం మంది కోలుకున్నారు. 50ఏళ్ల లోపు వారి మరణాల శాతం చాలా స్వల్పంగా ఉంది. ఈ గణాంకాల ఆధారంగా ప్రమాదం 60 ఏళ్లు పైబడినవారిలోనే అధికంగా ఉందని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.

  • 54 ఏళ్ల వ్యక్తిలో జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించాయి. నాలుగైదు రోజులు సొంతంగా మందులు వాడారు. లక్షణాలు చేయిదాటి, తీవ్ర శ్వాసకోశ సమస్యకు దారితీసింది. గాంధీ ఆసుపత్రికి తరలిస్తే కరోనాగా నిర్ధారించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందారు.
  • 43 ఏళ్ల మహిళ అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారు. మూత్రపిండాల వైఫల్య జబ్బుకు చికిత్స పొందుతున్నారు. కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు.

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. కొవిడ్ మరణాలూ పెరుగుతున్నాయి. కరోనా మరణాలను విశ్లేషిస్తే.. ప్రధానంగా రెండు కారణాలను వైద్యులు గుర్తించారు. మొదటిది అత్యధికుల్లో కరోనాతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, గుండెజబ్బు, మూత్రపిండాల వైఫల్యం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి.. తదితర అనుబంధ అనారోగ్య సమస్యలు ఉండటం. రెండోది కరోనా లక్షణాలను గుర్తించినా ఆలస్యంగా చికిత్సకు వచ్చినవారిలో మరణాల రేటు అధికంగా ఉండటం.

ఎక్కువ కేసులు నమోదైతే తదనుగుణంగా మరణాల సంఖ్యా హెచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. అసలు వైరస్‌ బారినపడడాన్ని తగ్గించగలిగితే మృతుల సంఖ్య కూడా తగ్గుతుంది. అందుకే వైరస్‌ వ్యాప్తి కట్టడికి విస్తృత ప్రచారం కల్పిస్తూనే.. మరణాలకు కారణాలైన ఆ రెంటిపైనా ప్రధానంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్లాస్మాథెరపీతో పాటు యాంటీ వైరల్‌ ఔషధాలను సైతం చికిత్సకు వినియోగించాలని ఆదివారం మంత్రి ఈటల నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆరోగ్యశాఖ తీర్మానించింది.

స్వేచ్ఛ కన్నా ప్రాణాలే ప్రధానం

రాష్ట్రంలో శనివారం 10 మంది కరోనాతో చనిపోగా, ఆదివారం ఆ సంఖ్య మరింత పెరిగి 14కు చేరింది. ఈ నెలలోనే ఇప్పటి వరకూ 55 మంది కొవిడ్‌తో మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించగానే.. స్వేచ్ఛను దుర్వినియోగం చేసే తీరు పెచ్చుపెరిగింది. ఫలితంగా వైరస్‌ వ్యాప్తీ వేగంగా జరుగుతోంది.

బయటకు వెళ్లొచ్చేవారి వల్ల ఇంట్లో ఉంటున్న వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు వైరస్‌ బారినపడుతున్నారు. వీరిలోనూ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించకపోవడం, సత్వర చికిత్స పొందకపోవడం ప్రాణాంతకమవుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మూణ్నాలుగు రోజులు ఆలస్యం చేసినా.. కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లో విధ్వంసం సృష్టిస్తోందని హెచ్చరిస్తున్నారు. ఆదివారం చనిపోయిన వారిలోనూ పది మందికి నిమోనియా లక్షణాలతో పాటు ఊపిరితిత్తులు వైఫల్యం చెందినట్లుగా వైద్యనివేదికల్లో పేర్కొనడం గమనార్హం. వీరిలో అధికులు ఆసుపత్రిలో చేరిన స్వల్పకాలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

కోలుకునేవారే అధికం

రాష్ట్రంలో మరణాల కంటే కోలుకునే వారే అధికంగా ఉన్నారు. మొత్తం కరోనా బాధితుల్లో మరణాల శాతం సుమారు 3 కాగా, కరోనా బారినపడినవారిలో వయసుల వారీగా పరిశీలించినా.. 60-69 ఏళ్ల వారిలోనూ 90.7 శాతం మంది కోలుకున్నారు. 50ఏళ్ల లోపు వారి మరణాల శాతం చాలా స్వల్పంగా ఉంది. ఈ గణాంకాల ఆధారంగా ప్రమాదం 60 ఏళ్లు పైబడినవారిలోనే అధికంగా ఉందని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.