రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా కనిపించడం లేదంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టిపై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కాదా అని ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలో పూర్తి చేసిన భక్త రామదాసు ప్రాజెక్టు కనబడటం లేదా అని నిలదీశారు. 2 లక్షల కోట్ల అప్పును 3 లక్షల కోట్లుగా చెప్పి ప్రజలకు అవాస్తవాలు చేరేలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్లకు అగ్రిమెంట్ లేదని అందుకే రీడిజైన్ చేశామని తెలిపారు. అప్పులు చేయకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. అవసరమైతే ఇంకో రూ.20 వేల కోట్ల అప్పు కూడా తెస్తామన్నారు. పరిమితులకు లోబడే అప్పులు తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : 'మీరు చెప్పుడేంది... మేమే చెప్తున్నం'