హైదరాబాద్ శివారు తుర్కయంజాల్ మున్సిపాలిటీ సమావేశం రసాభాసగా మారింది. అభివృద్ధిని కమిషనర్ అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. సమావేశం నుంచి బయటకు రాకుండా అడ్డుగా బైఠాయించారు.
కౌన్సిలర్లకు నిధులు ఇవ్వకుండా కమిషనర్ అడ్డుకుంటున్నారని నినాదాలు చేశారు. రాగన్నగూడ వార్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తగా పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల సాయంతో తుర్కయంజాల్ కమిషనర్ షఫీ ఉల్లా ఖాన్ కౌన్సిల్ సమావేశం మధ్యలోంచే వెళ్లిపోయారు.