ETV Bharat / city

నాచారంలో తెరాస, కాంగ్రెస్​ వర్గీయుల మధ్య ఘర్షణ

జీహెచ్​ఎంసీ ఎన్నికల వేళ పలు ప్రాంతాల్లో ఆయా పార్టీశ్రేణుల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. నాచారం 6వ డివిజన్​లో తెరాస, కాంగ్రెస్​ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు కలుగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

author img

By

Published : Dec 1, 2020, 4:13 PM IST

clash between trs and congress leaders at nacharam
clash between trs and congress leaders at nacharam
నాచారంలో తెరాస, కాంగ్రెస్​ వర్గీయుల మధ్య ఘర్షణ

జీహెచ్​ఎంసీ పోలింగ్​ వేళ నాచారం 6 వ డివిజన్​లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస అభ్యర్థి ఇంటి వద్ద కాంగ్రెస్, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ వర్గీయులు తమ పార్టీ అభ్యర్థి ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ... తెరాస నేతలు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో ఇరువర్గీయుల మధ్య మాటా మాటా పెరిగి... గొడవకు దారి తీసింది. పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి భర్త మేడల మల్లికార్జున్​ వల్ల తనకు ప్రాణహాని ఉందని తెరాస అభ్యర్థి శాంతి సాయి జెన్ శేఖర్ ఆరోపించారు.

ఇదీ చూడండి: ఒక్క ఓటే కదా.. అని వదలొద్దు! ఓటేద్దాం రండి!!

నాచారంలో తెరాస, కాంగ్రెస్​ వర్గీయుల మధ్య ఘర్షణ

జీహెచ్​ఎంసీ పోలింగ్​ వేళ నాచారం 6 వ డివిజన్​లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస అభ్యర్థి ఇంటి వద్ద కాంగ్రెస్, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ వర్గీయులు తమ పార్టీ అభ్యర్థి ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ... తెరాస నేతలు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో ఇరువర్గీయుల మధ్య మాటా మాటా పెరిగి... గొడవకు దారి తీసింది. పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి భర్త మేడల మల్లికార్జున్​ వల్ల తనకు ప్రాణహాని ఉందని తెరాస అభ్యర్థి శాంతి సాయి జెన్ శేఖర్ ఆరోపించారు.

ఇదీ చూడండి: ఒక్క ఓటే కదా.. అని వదలొద్దు! ఓటేద్దాం రండి!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.