ETV Bharat / city

సవాల్ స్వీకరించలేదంటే... ప్రజా మద్దతు లేనట్లే : చంద్రబాబు

author img

By

Published : Aug 23, 2020, 5:23 PM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మరోసారి డిమాండ్ చేశారు. ఆందోళనలు 250వ రోజుకు చేరిన సందర్భంగా ఇరువురు ట్వీట్​తో తమ మనోభావాలు పంచుకున్నారు.

సవాల్ స్వీకరించలేదంటే... ప్రజా మద్దతు లేనట్లే : చంద్రబాబు
సవాల్ స్వీకరించలేదంటే... ప్రజా మద్దతు లేనట్లే : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు.. 250వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పందించారు.

దేశ చరిత్రలోనే అరుదు : చంద్రబాబు

ఇంత సుదీర్ఘ ఉద్యమం దేశ చరిత్రలోనే అరుదని చంద్రబాబు అన్నారు. బాధితుల గోడు వినేందుకు ముందుకురాని పాలకులూ అరుదే అని ప్రస్తుత ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

తప్పుడు కేసులు బనాయించారు...

వేలమంది ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టారని.. 85 మంది అమరులైనా ప్రభుత్వం తమాషా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశామని గుర్తు చేశారు.

సవాల్ స్వీకరించలేదంటే... ప్రజా మద్దతు లేనట్లే : చంద్రబాబు
సవాల్ స్వీకరించలేదంటే... ప్రజా మద్దతు లేనట్లే : చంద్రబాబు

దానికి ప్రజామోదం లేనట్లే...

ఈ సవాల్​కు ముందుకు రాలేదంటే 3 రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతు లేనట్లే అని స్పష్టం చేశారు. భూములు త్యాగం చేసిన రైతులకు ప్రజలంతా అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

సవాల్ స్వీకరించలేదంటే... ప్రజా మద్దతు లేనట్లే : చంద్రబాబు
సవాల్ స్వీకరించలేదంటే... ప్రజా మద్దతు లేనట్లే : చంద్రబాబు

ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి : లోకేశ్

పాలకుడు మారినప్పుడల్లా రాజధాని మారిస్తే జరిగేది విచ్ఛిన్నమే అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. రాజధాని మూడు ముక్కలాట.. ఓ వికృత క్రీడ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.

ఇవీ చూడండి : 'నిజమైన నిరుపేదలను గుర్తించి ఇళ్లను ఇస్తున్నాం'

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు.. 250వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పందించారు.

దేశ చరిత్రలోనే అరుదు : చంద్రబాబు

ఇంత సుదీర్ఘ ఉద్యమం దేశ చరిత్రలోనే అరుదని చంద్రబాబు అన్నారు. బాధితుల గోడు వినేందుకు ముందుకురాని పాలకులూ అరుదే అని ప్రస్తుత ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

తప్పుడు కేసులు బనాయించారు...

వేలమంది ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టారని.. 85 మంది అమరులైనా ప్రభుత్వం తమాషా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశామని గుర్తు చేశారు.

సవాల్ స్వీకరించలేదంటే... ప్రజా మద్దతు లేనట్లే : చంద్రబాబు
సవాల్ స్వీకరించలేదంటే... ప్రజా మద్దతు లేనట్లే : చంద్రబాబు

దానికి ప్రజామోదం లేనట్లే...

ఈ సవాల్​కు ముందుకు రాలేదంటే 3 రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతు లేనట్లే అని స్పష్టం చేశారు. భూములు త్యాగం చేసిన రైతులకు ప్రజలంతా అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

సవాల్ స్వీకరించలేదంటే... ప్రజా మద్దతు లేనట్లే : చంద్రబాబు
సవాల్ స్వీకరించలేదంటే... ప్రజా మద్దతు లేనట్లే : చంద్రబాబు

ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి : లోకేశ్

పాలకుడు మారినప్పుడల్లా రాజధాని మారిస్తే జరిగేది విచ్ఛిన్నమే అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. రాజధాని మూడు ముక్కలాట.. ఓ వికృత క్రీడ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.

ఇవీ చూడండి : 'నిజమైన నిరుపేదలను గుర్తించి ఇళ్లను ఇస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.