దిశ హత్యాచార ఘటన చాలా బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభలో దిశ ఘటనపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా దిశ ఘటనను ఖండిస్తున్నారని తెలిపారు. విదేశాల్లోని ఈ ఘటనపై చర్చ జరుగుతోందని కిషన్రెడ్డి తెలిపారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఐపీసీ, సీఆర్పీసీలలో సవరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
ఇవీచూడండి: 'దిశ' హత్యాచారంపై రాజ్యసభలో విపక్షాల గళం