ఆర్టీసీకి చెందిన 45 మంది సొంత భద్రతా సిబ్బంది... 24 గంటలూ పెట్రోలింగ్... అఫ్టల్గంజ్ పోలీసు సిబ్బంది... ఎంజీబీస్ నిర్వాహక సిబ్బంది.. తనిఖీ సిబ్బంది... ఇలా వందల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. 127 సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్... దీంతో పాటు అప్జల్గంజ్ పోలీస్స్టేషన్ ఔట్ పోస్టు కూడా ఎంజీబీఎస్లోనే కొనసాగుతోంది.
![మూలకుపడిన నిఘానేత్రాలు... అటకెక్కిన ఎంజీబీఎస్ భద్రత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9373519_mgbs-3.jpg)
ఇంత పటిష్ఠమైన భద్రత ఉంటే ఇంకా తిరుగేముందని ప్రయాణికులు అనుకునేవారు. తమ వస్తువులు పక్కన పెట్టి మాటల్లో పడిపోయేవారు. లేదా సెల్ ఫోన్ సంభాషణలో మునిగిపోయేవారు. ఇందంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా... మీ వస్తువులు మాయం అవుతాయి. ఇందుకు అక్కడ ప్రతి చోట కనిపించే హెచ్చరిక బోర్డులే నిదర్శనం. “ దొంగలున్నారు జాగ్రత్త .. మీ వస్తువులకు మీరు జాగ్రత్త వహించండి. బస్సులో మీ విలువైన వస్తువులు పెట్టి బయటకు వెళ్లకండి. ఎంజీబీఎస్ ప్రాంగణంలో కూడా మీ వస్తువులను భద్రంగా ఉంచుకోండి.. మీ వస్తువుల భద్రత మీదే " అనే హెచ్చరికలు కనిపిస్తున్నాయి. ప్రాంగణం బయట కూడా మీ వాహనాల భద్రతకు బాధ్యులు అనే హెచ్చరికల బోర్డులు ఎక్కడికక్కడ కనిపిస్తాయి.
![మూలకుపడిన నిఘానేత్రాలు... అటకెక్కిన ఎంజీబీఎస్ భద్రత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9373519_mgbs-4.jpg)
![మూలకుపడిన నిఘానేత్రాలు... అటకెక్కిన ఎంజీబీఎస్ భద్రత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9373519_mgbs-2.jpg)
దీనంతటికీ కారణం .. అక్కడ సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడమే. లాక్డౌన్ కాలంలో వాటితో పని ఏముంది అనుకున్నారో ఏమో మరి. మొత్తం 127 సీసీటీవీ కెమెరాల్లో ఒక 5 కెమెరాలు మాత్రమే పని చేస్తున్నాయి. ఇలా 5 సీసీటీవీ కెమెరాలే పని చేయడం వల్ల కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పనిలేకుండా పోయింది. ఆ గది ముందు ఎంజీబీఎస్ చీఫ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్.. మరో ఇద్దరు ముగ్గురు సహాయకులు అక్కడే ఉండి విధులు నిర్వహిస్తుంటారు. మిగతా భద్రతా సిబ్బంది ప్రాంగణమంతా పర్యవేక్షిస్తుంటారు.
మూలకుపడిన నిఘానేత్రాలు... అటకెక్కిన ఎంజీబీఎస్ భద్రత
సీసీటీవీ కెమెరాలు పని చేయటం లేదని అక్కడ పని చేస్తున్న సిబ్బందితో పాటు... అప్జల్గంజ్ పోలీసులు కూడా ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని... పండుగల కాలం వస్తోంది కనుక ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని వారికి తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.