తెరాస సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విమర్శించారు. రైతులను బెదిరించి కేవలం రెండు పంటలు సాగు చేసేలా చేశారని ఆరోపించారు.
కేంద్రం రైతుల వద్ద పంటలు కొనుగోలు చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందన్నారు. రాష్ట్రంతో సంబంధం లేకుండా రైతులకు కేంద్రం నిధులు విడుదల చేస్తోందన్న మురళీధర్రావు.. తెరాస నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఇదీ చూడండి: ఆ మూడు రాష్ట్రాలు సహా కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు