ETV Bharat / city

గ్రేటర్​లో ఇక నుంచి మీసేవా కేంద్రాల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు

author img

By

Published : Jan 7, 2021, 9:57 AM IST

జీహెచ్ఎంసీలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఈ పత్రాల దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల జారీని జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లతో పాటు ఇకపై మీసేవా కేంద్రాల్లో కూడా అందుబాటులో వచ్చాయి.

birth and death certificates will be available in meeseva centers in ghmc from now
గ్రేటర్​లో ఇక నుంచి మీసేవా కేంద్రాల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జీహెచ్​ఎంసీ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పునర్ వ్యవస్థీకరించిన ఈ కొత్త విధానంలో సర్కిళ్లలోని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లను సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ బాధ్యతలను కేటాయించింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తు స్వీకరణ, సర్టిఫికెట్ల జారీని గ్రేటర్ సిటిజన్ సర్వీస్ సెంటర్లతో పాటు మీసేవా కేంద్రాల్లోకి అందుబాటులోకి తెచ్చింది.

పుట్టిన, మరణించిన 30 రోజుల్లోపు చేసుకునే దరఖాస్తుల పరిశీలన.. జారీచేసే అధికారాన్ని ఏఎంసీలకు అప్పగించారు. నెల తరువాత నుంచి ఏడాది వరకు సమయంలో వచ్చిన దరఖాస్తులను రిజిస్ట్రార్లుగా ఉండే ఏఎంహెచ్ఓలు పరిశీలించి జారీ చేస్తారు. ప్రస్తుతం వార్డు యూనిట్​గా ఉన్న జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ఇక సర్కిల్ యూనిట్​గా మారుతూ ఈ జనవరి 1వ తేదీ నుంచి నూతన విధానం అమలులోకి వచ్చింది.

జనన, మరణ దరఖాస్తులను జీహెచ్ఎంసీతో పాటు మీసేవా కేంద్రాలకు బదలాయింపునకుగాను జరిపిన సమాచార మార్పిడి క్రమంలో సర్వర్​లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ఆగిపోయింది.

సమాచార మార్పడి ప్రక్రియ పూర్తి కావడం వల్ల డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం నుంచి పూర్తిస్థాయిలో జనన, మరణ సర్టిఫికెట్ల జారీ అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 20 నుంచి జనవరి 5 వరకు 13 వేల 26 జనన, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయగా వీటిలో జనవరి 1 నుంచి 5 వరకు మీసేవా కేంద్రాల ద్వారా 7 వేల 561 సర్టిఫికెట్లు జారీ అయ్యాయి.

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జీహెచ్​ఎంసీ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పునర్ వ్యవస్థీకరించిన ఈ కొత్త విధానంలో సర్కిళ్లలోని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లను సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ బాధ్యతలను కేటాయించింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తు స్వీకరణ, సర్టిఫికెట్ల జారీని గ్రేటర్ సిటిజన్ సర్వీస్ సెంటర్లతో పాటు మీసేవా కేంద్రాల్లోకి అందుబాటులోకి తెచ్చింది.

పుట్టిన, మరణించిన 30 రోజుల్లోపు చేసుకునే దరఖాస్తుల పరిశీలన.. జారీచేసే అధికారాన్ని ఏఎంసీలకు అప్పగించారు. నెల తరువాత నుంచి ఏడాది వరకు సమయంలో వచ్చిన దరఖాస్తులను రిజిస్ట్రార్లుగా ఉండే ఏఎంహెచ్ఓలు పరిశీలించి జారీ చేస్తారు. ప్రస్తుతం వార్డు యూనిట్​గా ఉన్న జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ఇక సర్కిల్ యూనిట్​గా మారుతూ ఈ జనవరి 1వ తేదీ నుంచి నూతన విధానం అమలులోకి వచ్చింది.

జనన, మరణ దరఖాస్తులను జీహెచ్ఎంసీతో పాటు మీసేవా కేంద్రాలకు బదలాయింపునకుగాను జరిపిన సమాచార మార్పిడి క్రమంలో సర్వర్​లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ఆగిపోయింది.

సమాచార మార్పడి ప్రక్రియ పూర్తి కావడం వల్ల డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం నుంచి పూర్తిస్థాయిలో జనన, మరణ సర్టిఫికెట్ల జారీ అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 20 నుంచి జనవరి 5 వరకు 13 వేల 26 జనన, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయగా వీటిలో జనవరి 1 నుంచి 5 వరకు మీసేవా కేంద్రాల ద్వారా 7 వేల 561 సర్టిఫికెట్లు జారీ అయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.