రెవెన్యూ ట్రైబ్యునళ్లు న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని బార్ కౌన్సిల్ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసింది. రెవెన్యూ ట్రైబ్యునళ్లలో న్యాయవాదులను అనుమతించడం లేదని లేఖలో పేర్కొంది. నోటీసులు కూడా ఇవ్వకుండా అప్పీళ్లపై విచారణ ముగిస్తున్నారని ఆరోపించింది.
కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సీఎంను బార్ కౌన్సిల్ కోరింది. ఇదే విషయంపై సీఎస్ సోమేశ్ కుమార్కు కూడా బార్ కౌన్సిల్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు.