ETV Bharat / city

బద్వేలు వైకాపా ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య కన్నుమూత - ap mla died

badvel mla venkata subbaiah died
badvel mla venkata subbaiah died
author img

By

Published : Mar 28, 2021, 7:51 AM IST

Updated : Mar 28, 2021, 11:21 AM IST

07:21 March 28

బద్వేలు వైకాపా ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య కన్నుమూత

ఏపీలోని కడప జిల్లా బద్వేల్ శాసనసభ్యుడు డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతిచెందారు. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 6:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు ఎంబీబీఎస్ చేస్తుండగా... మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కడపలో ఆర్థోపెడిక్ డాక్టర్​గా వెంకటసుబ్బయ్య  కొంత కాలం సేవలందించారు.

వైకాపా నుంచి 2019లో తొలిసారిగా బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వు అయిన కారణంగా.. మంచి సౌమ్యుడిగా పేరున్న డాక్టర్ వెంకట సుబ్బయ్యకు వైకాపా అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు కేటాయించింది. రెండేళ్ల నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 3 నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స సైతం తీసుకున్నారు.

పది రోజుల కిందటే హైదరాబాద్ నుంచి ఆయన కడపకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి  ఆయనను ఫోన్లో పరామర్శించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ క్రమంలోనే నిన్న తీవ్ర అస్వస్థతకు గురికాగా ... కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు కుటంబసభ్యులు. చికిత్స పొందుతూ ఈ ఉదయం   వెంకటసుబ్బయ్య  కన్నుమూశారు.  విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

 ఆయన మృతదేహాన్ని బద్వేల్​కు  తీసుకెళ్లనున్నారు. అక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచుతారు. అక్కడి నుంచి  కడపకు తీసుకొచ్చి  సొంత పొలాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన సోదరుడు సుబ్బారావు తెలిపారు. ముఖ్యమంత్రి రాకపై ఇంకా స్పష్టత రాలేదు.

ఇదీ చూడండి: రుణాలు తీర్చలేక, సాగు చేయలేక రైతన్నల బలవన్మరణాలు

07:21 March 28

బద్వేలు వైకాపా ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య కన్నుమూత

ఏపీలోని కడప జిల్లా బద్వేల్ శాసనసభ్యుడు డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతిచెందారు. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 6:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు ఎంబీబీఎస్ చేస్తుండగా... మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కడపలో ఆర్థోపెడిక్ డాక్టర్​గా వెంకటసుబ్బయ్య  కొంత కాలం సేవలందించారు.

వైకాపా నుంచి 2019లో తొలిసారిగా బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వు అయిన కారణంగా.. మంచి సౌమ్యుడిగా పేరున్న డాక్టర్ వెంకట సుబ్బయ్యకు వైకాపా అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు కేటాయించింది. రెండేళ్ల నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 3 నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స సైతం తీసుకున్నారు.

పది రోజుల కిందటే హైదరాబాద్ నుంచి ఆయన కడపకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి  ఆయనను ఫోన్లో పరామర్శించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ క్రమంలోనే నిన్న తీవ్ర అస్వస్థతకు గురికాగా ... కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు కుటంబసభ్యులు. చికిత్స పొందుతూ ఈ ఉదయం   వెంకటసుబ్బయ్య  కన్నుమూశారు.  విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

 ఆయన మృతదేహాన్ని బద్వేల్​కు  తీసుకెళ్లనున్నారు. అక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచుతారు. అక్కడి నుంచి  కడపకు తీసుకొచ్చి  సొంత పొలాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన సోదరుడు సుబ్బారావు తెలిపారు. ముఖ్యమంత్రి రాకపై ఇంకా స్పష్టత రాలేదు.

ఇదీ చూడండి: రుణాలు తీర్చలేక, సాగు చేయలేక రైతన్నల బలవన్మరణాలు

Last Updated : Mar 28, 2021, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.