ETV Bharat / city

ఈరోజే తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఏర్పాట్లు పూర్తి

author img

By

Published : May 1, 2021, 8:41 PM IST

Updated : May 2, 2021, 1:08 AM IST

ఏపీలో తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశారు. మే 2న పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు లెక్కించాల్సి ఉంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి మూడు, నెల్లూరు జిల్లాకు సంబంధించి 4 నియోజకర్గాలు ఉన్నాయి. 2,470 పోలింగ్ స్టేషన్ల ఓట్లు లెక్కించాల్సి ఉంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే లెక్కింపు ప్రక్రియ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

tirupathi election counting
రేపే తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఏర్పాట్లు పూర్తి
ఈరోజే తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

ఏపీలో తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో... చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో జరగనుంది. చిత్తూరు జిల్లా తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు తిరుపతిలోని ఎస్.వి.విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు.

మొదట సర్వీసు ఓటర్లకు ఆన్​లైన్ ద్వారా పంపించిన ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. తర్వాత పోస్టల్ బ్యాలెట్స్, ఆ తర్వాత ఈవీఎం మిషన్లలోని ఓట్లు లెక్కిస్తారు. కొవిడ్ నెగెటివ్ రిపోర్టు పత్రాలు ఉంటేనే కౌంటింగ్ హాలులోకి అనుమతిస్తారు. కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ పీపీఈ కిట్ తప్పక ధరించాలనే నిబంధనలు విధించారు. కౌంటింగ్ ప్రక్రియలో అత్యధికంగా 25 రౌండ్లు ఉండబోతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 8 టేబుల్స్​లో ప్రత్యేకంగా కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు.

కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకూ నో మాన్ జోన్​గా పరిగణించారు. ఔటర్ రింగ్​లో సివిల్ పోలీసులు, ఇన్నర్ రింగ్​లో ఆర్మ్​డ్ పోలీసు సిబ్బంది ఉంటారు. స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ రూంల వద్ద కేంద్ర బలగాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేధించారు. మే 2న కౌంటింగ్ పూర్తి అయినా.. ఆ తర్వాత 4వ తేదీ వరకూ ఎన్నికల నియమావళి రెండు జిల్లాల్లోనూ అమల్లో ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కరోనాపై ప్రతిరోజూ మూడుసార్లు సమీక్ష నిర్వహించాలి: సీఎం

ఈరోజే తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

ఏపీలో తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో... చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో జరగనుంది. చిత్తూరు జిల్లా తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు తిరుపతిలోని ఎస్.వి.విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు.

మొదట సర్వీసు ఓటర్లకు ఆన్​లైన్ ద్వారా పంపించిన ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. తర్వాత పోస్టల్ బ్యాలెట్స్, ఆ తర్వాత ఈవీఎం మిషన్లలోని ఓట్లు లెక్కిస్తారు. కొవిడ్ నెగెటివ్ రిపోర్టు పత్రాలు ఉంటేనే కౌంటింగ్ హాలులోకి అనుమతిస్తారు. కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ పీపీఈ కిట్ తప్పక ధరించాలనే నిబంధనలు విధించారు. కౌంటింగ్ ప్రక్రియలో అత్యధికంగా 25 రౌండ్లు ఉండబోతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 8 టేబుల్స్​లో ప్రత్యేకంగా కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు.

కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకూ నో మాన్ జోన్​గా పరిగణించారు. ఔటర్ రింగ్​లో సివిల్ పోలీసులు, ఇన్నర్ రింగ్​లో ఆర్మ్​డ్ పోలీసు సిబ్బంది ఉంటారు. స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ రూంల వద్ద కేంద్ర బలగాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేధించారు. మే 2న కౌంటింగ్ పూర్తి అయినా.. ఆ తర్వాత 4వ తేదీ వరకూ ఎన్నికల నియమావళి రెండు జిల్లాల్లోనూ అమల్లో ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కరోనాపై ప్రతిరోజూ మూడుసార్లు సమీక్ష నిర్వహించాలి: సీఎం

Last Updated : May 2, 2021, 1:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.