ETV Bharat / city

అమీర్​పేట్​ మెట్రో ప్రమాద ఘటనపై విచారణ

author img

By

Published : Sep 24, 2019, 11:37 PM IST

అమీర్​పేట్​ మెట్రో స్టేషన్‌లో జరిగిన ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై మెట్రో రైల్ సేఫ్టీ కమిషనర్, పౌర విమానయాన మంత్రిత్వశాఖ విచారణ చేపట్టింది.

అమీర్​పేట్​ మెట్రో ప్రమాద ఘటనపై విచారణ
అమీర్​పేట్​ మెట్రో ప్రమాద ఘటనపై విచారణ

హైదరాబాద్​ అమీర్​పేట్​ మెట్రో స్టేషన్​లో పెచ్చులు ఊడిపడి యువతి మృతిచెందిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. మెట్రోరైల్ సేఫ్టీ కమిషనర్ జేకే గార్గ్‌ అమీర్‌పేట్​ స్టేషన్‌ వద్ద ప్రమాదస్థలిని పరిశీలించారు. ఘటనపై మెట్రోరైల్ సేఫ్టీ కమిషనర్, పౌర విమానయాన మంత్రిత్వశాఖ విచారణ చేపట్టింది. ఇది ప్రాథమిక తనిఖీ అని తదుపరి తనిఖీలు నిర్ణీత సమయంలో జరుగుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అవసరమైన ఇంజినీరింగ్ పరీక్షలు హైదరాబాద్ ఐఐటీ పర్యవేక్షణలో జరగనున్నాయి. అక్టోబర్ 3న మెట్రో రైల్​భవన్‌లో సీఎంఆర్‌ఎస్ పబ్లిక్ హియరింగ్ జరగనుంది. ఇవాళ జరిగిన విచారణకు హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, డీసీఎంఆర్‌ఎస్ రామ్ మెహెర్‌, ఎల్‌ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌కు సంబంధించిన ఇంజినీర్లు హాజరయ్యారు.

ఇదీ చూడండి: ప్రమాదంపై స్పందించిన మెట్రో ఎండీ

అమీర్​పేట్​ మెట్రో ప్రమాద ఘటనపై విచారణ

హైదరాబాద్​ అమీర్​పేట్​ మెట్రో స్టేషన్​లో పెచ్చులు ఊడిపడి యువతి మృతిచెందిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. మెట్రోరైల్ సేఫ్టీ కమిషనర్ జేకే గార్గ్‌ అమీర్‌పేట్​ స్టేషన్‌ వద్ద ప్రమాదస్థలిని పరిశీలించారు. ఘటనపై మెట్రోరైల్ సేఫ్టీ కమిషనర్, పౌర విమానయాన మంత్రిత్వశాఖ విచారణ చేపట్టింది. ఇది ప్రాథమిక తనిఖీ అని తదుపరి తనిఖీలు నిర్ణీత సమయంలో జరుగుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అవసరమైన ఇంజినీరింగ్ పరీక్షలు హైదరాబాద్ ఐఐటీ పర్యవేక్షణలో జరగనున్నాయి. అక్టోబర్ 3న మెట్రో రైల్​భవన్‌లో సీఎంఆర్‌ఎస్ పబ్లిక్ హియరింగ్ జరగనుంది. ఇవాళ జరిగిన విచారణకు హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, డీసీఎంఆర్‌ఎస్ రామ్ మెహెర్‌, ఎల్‌ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌కు సంబంధించిన ఇంజినీర్లు హాజరయ్యారు.

ఇదీ చూడండి: ప్రమాదంపై స్పందించిన మెట్రో ఎండీ

TG_Hyd_88_24_Metro_Rail_Accident_Inquiry_Dry_3182301 Reporter: Karthik Script: Razaq Note: అవసరం మేరకు ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు అమీర్ పేట స్టేషన్‌లో జరిగిన ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. ఈ ప్రమాదంపై మెట్రో రైల్ సేఫ్టీ కమిషనర్ ( సీఎంఆర్‌ఎస్‌ ), పౌర విమానయాన మంత్రిత్వశాఖ విచారణ చేపట్టింది. మెట్రో రైల్ సేఫ్టీ కమిషనర్ జేకే గార్గ్‌ అమీర్‌పేట స్టేషన్‌ వద్ద ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఇది ప్రాథమిక తనిఖీ అని తదుపరి తనిఖీలు నిర్ణీత సమయంలో జరుగుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అవసరమైన ఇంజనీరింగ్ పరీక్షలు హైదరాబాద్ ఐఐటీ పర్యవేక్షణలో జరుగనున్నాయి. వచ్చె నెల అంటే అక్టోబర్ 3వ తేదీన మెట్రో రైల్‌ భవన్‌లో సీఎంఆర్‌ఎస్ పబ్లిక్ హియరింగ్ జరుగనుంది. నేడు జరిగిన విచారణలో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, డీసీఎంఆర్‌ఎస్ రామ్ మెహెర్‌, ఎల్‌ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌కు సంబంధించిన ఇంజినీర్లు ఉన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.