ETV Bharat / city

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ - ఏపీ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ 2020

ఏపీకి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్​ అధికారి ఆదిత్యానాథ్ దాస్​ నియమితులయ్యారు. ఈనెల 31న బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

adithayanath-das-going-to-be-new-cs-to-andhra-pradesh
ఏపీ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌
author img

By

Published : Dec 22, 2020, 8:04 PM IST

ఆంధ్రప్రదేశ్​కు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్​ను నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సీఎస్ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 31వ తేదీన ఆదిత్యనాథ్ దాస్​ తదుపరి సీఎస్​గా బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం నోటిఫికేషన్​లో పేర్కొంది.

adithayanath-das-going-to-be-new-cs-to-andhra-pradesh
ఏపీ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌

ఈనెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నినీ ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. వైద్యారోగ్యం కొవిడ్ మేనేజ్​మెంట్​తో పాటు కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, గ్రామ సచివాలయాల బలోపేతం తదితర అంశాలను పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది.

మరోవైపు తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీ కేడర్​కు బదిలీ అయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆమెను ఏపీ పురపాలక శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామల రావును ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్థిక శాఖలో పని చేస్తున్న కె.సునీతను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. సాంఘిక సంక్షేమ సహకార ఆర్థిక కార్పొరేషన్ వీసీ, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

ఇదీ చదవండి: 'కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రాణాంతకం కాదు.. భయమొద్దు'

ఆంధ్రప్రదేశ్​కు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్​ను నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సీఎస్ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 31వ తేదీన ఆదిత్యనాథ్ దాస్​ తదుపరి సీఎస్​గా బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం నోటిఫికేషన్​లో పేర్కొంది.

adithayanath-das-going-to-be-new-cs-to-andhra-pradesh
ఏపీ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌

ఈనెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నినీ ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. వైద్యారోగ్యం కొవిడ్ మేనేజ్​మెంట్​తో పాటు కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, గ్రామ సచివాలయాల బలోపేతం తదితర అంశాలను పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది.

మరోవైపు తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీ కేడర్​కు బదిలీ అయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆమెను ఏపీ పురపాలక శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామల రావును ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్థిక శాఖలో పని చేస్తున్న కె.సునీతను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. సాంఘిక సంక్షేమ సహకార ఆర్థిక కార్పొరేషన్ వీసీ, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

ఇదీ చదవండి: 'కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రాణాంతకం కాదు.. భయమొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.