ETV Bharat / city

ఏపీ మంత్రుల కాన్వాయ్​కి ప్రమాదం.. 3 వాహనాలు ధ్వంసం - ఏపీలో మంత్రులకు తప్పిన ముప్పు

ఏపీ మంత్రుల కాన్వాయ్‌లో వాహనాలు ఢీకొన్నాయి. అకస్మాత్తుగా కాన్వాయ్‌లోని మొదటి వాహనం బ్రేక్‌ వేయడంతో ప్రమాదం జరిగింది. ఒకదానికొకటి ఢీకొని 3 వాహనాలు ధ్వంసం అయ్యాయి. మంత్రులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

accident-in-convoy-of-ap-ministers-in-nellore-district
ఏపీ మంత్రుల కాన్వాయ్​కి ప్రమాదం.. 3 వాహనాలు ధ్వంసం
author img

By

Published : Nov 9, 2020, 4:11 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్‌ప్లాజా వద్ద ఏపీ మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ కాన్వాయ్‌లోని ఓ వాహనం డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశారు. ఈ క్రమంలో కాన్వాయ్‌లోని మిగతా వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. దీంతో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. కృష్ణాపురం వద్ద హై లెవెల్‌ కెనాల్‌ ఫేజ్-‌2 పైలాన్‌ ప్రారంభోత్సవానికి మంత్రులు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే ఈ ఘటనలో మంత్రులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. కాన్వాయ్‌లోని చివరి వాహనాలే దెబ్బతిన్నాయి. కొద్ది సేపటి తర్వాత మంత్రులు అక్కడి నుంచి తిరిగి బయల్దేరి వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్‌ప్లాజా వద్ద ఏపీ మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ కాన్వాయ్‌లోని ఓ వాహనం డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశారు. ఈ క్రమంలో కాన్వాయ్‌లోని మిగతా వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. దీంతో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. కృష్ణాపురం వద్ద హై లెవెల్‌ కెనాల్‌ ఫేజ్-‌2 పైలాన్‌ ప్రారంభోత్సవానికి మంత్రులు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే ఈ ఘటనలో మంత్రులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. కాన్వాయ్‌లోని చివరి వాహనాలే దెబ్బతిన్నాయి. కొద్ది సేపటి తర్వాత మంత్రులు అక్కడి నుంచి తిరిగి బయల్దేరి వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రెండ్రోజుల క్రితం ప్రగతిభవన్​లో చిరంజీవి.. అధికారులకు కరోనా​ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.