పట్టాదారు పాసు పుస్తకంలో మార్పులు, చేర్పులు చేసేందుకు రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ద్వారకాపేట్ గ్రామ రెవెన్యూ అధికారి రవీందర్ అనిశా వలకు చిక్కాడు. గ్రామానికి చెందిన విజయపాల్రెడ్డి అనే వ్యక్తి పాసుపుస్తకంలో మార్పులు చేయడానికి వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు.
హైదరాబాద్ హబ్సీగూడలోని కినరా గ్రాండ్ హోటల్లో బాధితుడి నుంచి వీఆర్వో నగదు తీసుకుంటుండగా... ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రవీందర్ను అరెస్టు చేసి అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించి చంచల్గూడ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే... టోల్ ఫ్రీ నెంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు.
ఇదీ చూడండి: అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా స్వాధీనం