ETV Bharat / city

తిరుమల టికెట్​ బుక్​ చేసుకుని దర్శనాలకు రాని భక్తులు

author img

By

Published : Nov 11, 2020, 5:33 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల దర్శనాల సంఖ్య తగ్గుతోంది. ప్రత్యేకించి ఆన్​లైన్​లో 300 రూపాయల టికెట్లను ముందుగానే బుక్ చేసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలకు రావటంలేదు. టైంస్లాట్ సర్వదర్శనాల కోసం క్యూలైన్ల వద్ద హోరాహోరీగా తలపడి టోకెన్లు పొందిన భక్తుల్లోనూ గైర్హాజరీ అధిక సంఖ్యలో కనిపిస్తోంది.

absents-increasing-for-srivari-darshanam-in-tirumala
శ్రీవారి దర్శనానికి టికెట్​ బుక్​ చేసుకుని మరీ మానేస్తున్నారు..!

మునుపెన్నడూ చూడని పరిస్థితులను దాటుకుని కలియుగ వైకుంఠనాథుడి దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. గత కొద్దిరోజులుగా స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో 30 వేలను దాటింది. కొవిడ్ ప్రోటోకాల్​ను పాటిస్తూ భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా తితిదే ఏర్పాట్లు చేస్తోంది. లాక్​డౌన్ తర్వాత దర్శనాలు పునఃప్రారంభం చేసిన సమయంలో దర్శనాల కోసం ఆన్​లైన్​లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాల టోకెన్లను బుక్ చేసుకున్న వారికే తితిదే అవకాశం కల్పించింది.

ఎన్నడూ లేని విధంగా గైర్హాజరు..

ఆ తర్వాత సామాన్యభక్తుల నుంచి వస్తున్న విన్నపాలను దృష్టిలో ఉంచుకుని ఆఫ్​లైన్ విధానంలో తిరుపతిలో టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లను రెండు కేంద్రాల్లో జారీ చేస్తోంది. ప్రస్తుతం రోజుకు 7వేల సర్వదర్శనం టోకెన్లను ఇస్తున్నా.. భక్తులు అధికంగా వచ్చిన పక్షంలో ఉపయుక్తమయ్యేలా మరో 3వేల టోకెన్లను అదనంగా అధికారులు అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో.. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శనాల గైర్హాజరు శాతం పెరుగుతోంది. గతంవారం రోజుల నుంచి నమోదైన వివరాలను పరిశీలిస్తే ఈ విషయాలు స్పష్టం అవుతున్నాయి. ప్రత్యేకించి ఆన్​లైన్​లో 300 రూపాయల టికెట్లను ముందుగానే బుక్ చేసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలకు రావటం లేదు. టైంస్లాట్ సర్వదర్శనాల కోసం క్యూలైన్ల వద్ద హోరాహోరీగా తలపడి టోకెన్లు పొందిన భక్తుల్లోనూ గైర్హాజరీ అధిక సంఖ్యలో కనిపిస్తోంది.

టోకెన్లను పెంచుతున్నా..

భక్తుల సౌలభ్యం కోసం తితిదే జారీ చేసే టోకెన్లను పెంచుతున్నా.. ఈ స్థాయిలో టికెట్లు పొందిన భక్తులు రాకపోవటం ఇదే తొలిసారి. కారణాలు స్పష్టంగా అధికారులు చెప్పలేకపోతున్నా కొవిడ్ ప్రభావం, కొంత మందికి టైంస్లాట్ సమయాలపై అవగాహన లేకపోవటం, మరికొంత మంది ఇప్పటికీ దర్శనాల విషయంలో జంకుతుండటం ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయి. టికెట్ బుక్​ చేసుకుని లేదా ఆఫ్​లైన్​లో టోకెన్ తీసుకుని దర్శనానికి రాకపోవటం వల్ల నిజంగా దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు అవకాశం కోల్పోతున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు కొవిడ్ భయం లేకుండా తితిదే అధికారులు చర్యలు చేపడుతున్నారు. క్యూలైన్లలో భక్తులు భౌతిక దూరం పాటించటం, శానిటైజేషన్ వంటి అంశాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవీ చూడండి: యాదాద్రిలో లక్ష పుష్పార్చన మహోత్సవం

మునుపెన్నడూ చూడని పరిస్థితులను దాటుకుని కలియుగ వైకుంఠనాథుడి దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. గత కొద్దిరోజులుగా స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో 30 వేలను దాటింది. కొవిడ్ ప్రోటోకాల్​ను పాటిస్తూ భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా తితిదే ఏర్పాట్లు చేస్తోంది. లాక్​డౌన్ తర్వాత దర్శనాలు పునఃప్రారంభం చేసిన సమయంలో దర్శనాల కోసం ఆన్​లైన్​లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాల టోకెన్లను బుక్ చేసుకున్న వారికే తితిదే అవకాశం కల్పించింది.

ఎన్నడూ లేని విధంగా గైర్హాజరు..

ఆ తర్వాత సామాన్యభక్తుల నుంచి వస్తున్న విన్నపాలను దృష్టిలో ఉంచుకుని ఆఫ్​లైన్ విధానంలో తిరుపతిలో టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లను రెండు కేంద్రాల్లో జారీ చేస్తోంది. ప్రస్తుతం రోజుకు 7వేల సర్వదర్శనం టోకెన్లను ఇస్తున్నా.. భక్తులు అధికంగా వచ్చిన పక్షంలో ఉపయుక్తమయ్యేలా మరో 3వేల టోకెన్లను అదనంగా అధికారులు అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో.. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శనాల గైర్హాజరు శాతం పెరుగుతోంది. గతంవారం రోజుల నుంచి నమోదైన వివరాలను పరిశీలిస్తే ఈ విషయాలు స్పష్టం అవుతున్నాయి. ప్రత్యేకించి ఆన్​లైన్​లో 300 రూపాయల టికెట్లను ముందుగానే బుక్ చేసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలకు రావటం లేదు. టైంస్లాట్ సర్వదర్శనాల కోసం క్యూలైన్ల వద్ద హోరాహోరీగా తలపడి టోకెన్లు పొందిన భక్తుల్లోనూ గైర్హాజరీ అధిక సంఖ్యలో కనిపిస్తోంది.

టోకెన్లను పెంచుతున్నా..

భక్తుల సౌలభ్యం కోసం తితిదే జారీ చేసే టోకెన్లను పెంచుతున్నా.. ఈ స్థాయిలో టికెట్లు పొందిన భక్తులు రాకపోవటం ఇదే తొలిసారి. కారణాలు స్పష్టంగా అధికారులు చెప్పలేకపోతున్నా కొవిడ్ ప్రభావం, కొంత మందికి టైంస్లాట్ సమయాలపై అవగాహన లేకపోవటం, మరికొంత మంది ఇప్పటికీ దర్శనాల విషయంలో జంకుతుండటం ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయి. టికెట్ బుక్​ చేసుకుని లేదా ఆఫ్​లైన్​లో టోకెన్ తీసుకుని దర్శనానికి రాకపోవటం వల్ల నిజంగా దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు అవకాశం కోల్పోతున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు కొవిడ్ భయం లేకుండా తితిదే అధికారులు చర్యలు చేపడుతున్నారు. క్యూలైన్లలో భక్తులు భౌతిక దూరం పాటించటం, శానిటైజేషన్ వంటి అంశాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవీ చూడండి: యాదాద్రిలో లక్ష పుష్పార్చన మహోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.