సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో 46వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు.. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ క్రీడా జ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభించారు.
క్రీడాకారుల నైపుణ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా క్రీడాకారుల ఎంపిక నైపుణ్యం ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన విధానాలు పక్కకు పెట్టి కొత్త ఒరవడితో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కబడ్డీ క్రీడాకారుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వీటిని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.