ETV Bharat / city

Skating Ganesh: నిమజ్జనానికి వినూత్నంగా.. 40 కిలోమీటర్లు స్కేటింగ్​ చేస్తూ ట్యాంక్​బండ్​కు.. - vavilala ganesh

వేల సంఖ్యలో గణనాథులు ట్యాంక్​బండ్​కు తరలివచ్చాయి. లారీల్లో, ఆటోల్లో, కారుల్లో, ట్రాలీలతో, బైకులపై.. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు.. హుస్సేన్​సాగర్​ వరకు గణేశుల శోభాయాత్ర నిర్వహించారు. ఈ వినాయకుడు మాత్రం కాస్త.. వినూత్నంగా ట్యాంక్​బండ్​కు తరలివచ్చాడు. ఏకంగా 40 కిలోమీటర్లు స్కేటింగ్​ చేస్తూ.. తన బుజ్జి గణపయ్యను ట్యాంక్​బండ్​కు తీసుకొచ్చాడు ఓ భక్తుడు.

40 kilometers skating for Ganesh immersion in tank bund from vavilala village
40 kilometers skating for Ganesh immersion in tank bund from vavilala village
author img

By

Published : Sep 19, 2021, 5:51 PM IST

రాష్ట్రవ్యాప్తంగా గణేశ్​ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. హైదరాబాద్​లోని గణనాయకులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు ట్యాంక్​బండ్​కు క్యూకట్టాయి. హుస్సేన్​సాగర్​కు వచ్చే క్రమంలో వినాయకుల శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. నగరంలోని వినాయకులే కాకుండా పక్కనున్న సంగారెడ్డి నుంచి కూడా ఓ వినాయకుడు ట్యాంక్​బండ్​లో నిమజ్జనమయ్యేందుకు వినూత్నంగా తరలివచ్చాడు.

స్కేటింగ్​ చేస్తూనే శోభాయాత్ర..

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వావివాల గ్రామానికి చెందిన లక్ష్మణ్​.. తన ఇంట్లో వినాయకున్ని ప్రతిష్ఠించుకున్నాడు. నవరాత్రులు ఘనంగా పూజించాడు. నిమజ్జనం ట్యాంక్​బండ్​లోనే చేయాలన్న పట్టుదలతో హైదరాబాద్​కు తీసుకొచ్చాడు. అందరిలాగా.. ఆ వినాయకుని శోభాయాత్ర ఆటోలోనో.. కారులోనో.. లారీలోనో.. ట్రాలీలోనో.. బండిపైనో సాగలేదు. వినూత్న రీతిలో ఆ భక్తుడే స్కేటింగ్​ చేస్తూ.. ట్యాంక్​బండ్​కు తరలివచ్చాడు. దాదాపు 40 కిలోమీటర్ల దూరం స్కేటింగ్​ చేసుకుంటూనే.. తన బుజ్జి గణేశున్ని హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేసేందుకు తీసుకొచ్చాడు.

ఐదేళ్లుగా స్కేటింగ్​ చేస్తూనే..

విగ్రహాం కదలకుండా ఉండేలా.. తన ముందు భాగంలో ఏర్పాటు చేసుకుని.. తాళ్లతో కట్టున్నాడు. ఈ సరంజామాను ఆకట్టుకునే డెకరేషన్​తో అలంకరించుకుని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఉదయం ఏడు గంటలకు మొదలుపెట్టిన ఈ స్కేటింగ్​ శోభాయాత్ర.. అక్కడక్కడా సేదతీరుతూ.. సాయంత్రానికి ట్యాంక్​బండ్​ చేరుకుంది. ఇలా గత ఐదేళ్లుగా.. గణేశున్ని స్కేటింగ్​ చేస్తూ ట్యాంక్​బండ్​కు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నట్టు లక్ష్మణ్​ చెబుతున్నాడు. తన తండ్రి, గ్రామ సర్పంచ్​తో పాటు స్థానికుల ఇస్తున్న ప్రోత్సాహంతోనే ప్రతి ఏటా గణనాథుని తీసుకొని స్కేటింగ్​ చేసుకుంటూ వస్తున్నానని తెలిపాడు.

నిమజ్జనానికి వినూత్నంగా.. 40 కిలోమీటర్లు స్కేటింగ్​ చేస్తూ ట్యాంక్​బండ్​కు..

ఇదీ చూడండి:

Khairatabad Ganesh: జలప్రవేశం చేసిన ఖైరతాబాద్‌ మహారుద్ర గణపతి

రాష్ట్రవ్యాప్తంగా గణేశ్​ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. హైదరాబాద్​లోని గణనాయకులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు ట్యాంక్​బండ్​కు క్యూకట్టాయి. హుస్సేన్​సాగర్​కు వచ్చే క్రమంలో వినాయకుల శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. నగరంలోని వినాయకులే కాకుండా పక్కనున్న సంగారెడ్డి నుంచి కూడా ఓ వినాయకుడు ట్యాంక్​బండ్​లో నిమజ్జనమయ్యేందుకు వినూత్నంగా తరలివచ్చాడు.

స్కేటింగ్​ చేస్తూనే శోభాయాత్ర..

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వావివాల గ్రామానికి చెందిన లక్ష్మణ్​.. తన ఇంట్లో వినాయకున్ని ప్రతిష్ఠించుకున్నాడు. నవరాత్రులు ఘనంగా పూజించాడు. నిమజ్జనం ట్యాంక్​బండ్​లోనే చేయాలన్న పట్టుదలతో హైదరాబాద్​కు తీసుకొచ్చాడు. అందరిలాగా.. ఆ వినాయకుని శోభాయాత్ర ఆటోలోనో.. కారులోనో.. లారీలోనో.. ట్రాలీలోనో.. బండిపైనో సాగలేదు. వినూత్న రీతిలో ఆ భక్తుడే స్కేటింగ్​ చేస్తూ.. ట్యాంక్​బండ్​కు తరలివచ్చాడు. దాదాపు 40 కిలోమీటర్ల దూరం స్కేటింగ్​ చేసుకుంటూనే.. తన బుజ్జి గణేశున్ని హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేసేందుకు తీసుకొచ్చాడు.

ఐదేళ్లుగా స్కేటింగ్​ చేస్తూనే..

విగ్రహాం కదలకుండా ఉండేలా.. తన ముందు భాగంలో ఏర్పాటు చేసుకుని.. తాళ్లతో కట్టున్నాడు. ఈ సరంజామాను ఆకట్టుకునే డెకరేషన్​తో అలంకరించుకుని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఉదయం ఏడు గంటలకు మొదలుపెట్టిన ఈ స్కేటింగ్​ శోభాయాత్ర.. అక్కడక్కడా సేదతీరుతూ.. సాయంత్రానికి ట్యాంక్​బండ్​ చేరుకుంది. ఇలా గత ఐదేళ్లుగా.. గణేశున్ని స్కేటింగ్​ చేస్తూ ట్యాంక్​బండ్​కు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నట్టు లక్ష్మణ్​ చెబుతున్నాడు. తన తండ్రి, గ్రామ సర్పంచ్​తో పాటు స్థానికుల ఇస్తున్న ప్రోత్సాహంతోనే ప్రతి ఏటా గణనాథుని తీసుకొని స్కేటింగ్​ చేసుకుంటూ వస్తున్నానని తెలిపాడు.

నిమజ్జనానికి వినూత్నంగా.. 40 కిలోమీటర్లు స్కేటింగ్​ చేస్తూ ట్యాంక్​బండ్​కు..

ఇదీ చూడండి:

Khairatabad Ganesh: జలప్రవేశం చేసిన ఖైరతాబాద్‌ మహారుద్ర గణపతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.