ETV Bharat / city

టాప్​ 10 వార్తలు@ 11 AM

author img

By

Published : Jun 7, 2020, 10:57 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
టాప్​ 10 వార్తలు@ 11 AM

దేశంలో కరోనా రికార్డ్: 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయంటే..

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,971 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 287 మంది మరణించారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. కొవిడ్​-19 కేసులపరంగా భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసా..

లైవ్​ వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య

ఎనిమిది మంది దుండగులు ఓ యువ వ్యాపారవేత్తను పట్టపగలే కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు ఎక్కడ జరిగిందంటే..

'గ్యాస్​ లీక్' కలకలం

ముంబయిలో గ్యాస్​ లీక్​ అంటూ కలకలం రేగింది. తెల్లవారుజామునే పలు ఫోన్లు రావటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో తనిఖీ చేసి ఈ వార్తలు అవాస్తవమని తెలిపారు అధికారులు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, అసత్య వార్తలు నమ్మవద్దని సూచించారు.

పురిటినొప్పులతో విలవిల్లాడింది.. బావిలో పడి చనిపోయింది..

చిన్నప్ప... సన్నకారు రైతు. పాడితో అంతో ఇంతో ఆదాయం వస్తుందని ఓ ఆవును పోషిస్తున్నాడు. ఇటీవల అది చూడికి వచ్చింది. అప్పటి నుంచి మరింత శ్రద్ధ చూపుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. చెంగుచెంగున పరుగులెత్తే లేగదూడ తన ఇంటికి వస్తుందని మురిసిపోయాడు. కానీ అంతలో

తెలుగు రాష్ట్రాల 15 ప్రాజెక్టులపై ఆరా

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ప్రాజెక్టుల పూర్తి వివరాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు నుంచి కేంద్రం తీసుకున్నట్లు తెలిసింది. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సూచన మేరకు 2 రాష్ట్రాలకు సంబంధించిన 15 ప్రాజెక్టుల వివరాలను బోర్డు అధికారులు పంపినట్లు సమాచారం.

జనావాసాల్లోకి చిరుతల రాకుండా ఇలా చేస్తాం.!

అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి జంతువుల కదలికలను నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి తెలిపారు. పరిహారం ఎందుకు ఇస్తామన్నారు.. ?

అడుగడుగునా తనిఖీలు..

తిరుమలలో స్వామి వారి దర్శనాలు పున:ప్రారంభమవుతున్నందున తితిదే పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అలిపిరి నుంచి ఆనంద నిలయం వరకూ అడుగడుగునా తనిఖీలు నిర్వహించనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను బుక్‌ చేసుకుని వస్తే మంచిదని ఎవరన్నారు.

సన్నీ ప్రేమ కహానీ.. మీటుతుంది మీ హృదయాన్ని

జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ హాట్ గర్ల్ సన్నీ లియోనీ. తన లవ్​లైఫ్​ కూడా అంత సాఫీగా సాగలేదు. ఈ భామ ప్రేమ కహానీపై ఫూర్తి కథనం మీకోసం.

'అవకాశం ఇస్తే.. ఐపీఎల్​ నిర్వహణకు మేము రెడీ'

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్​-2020పై సందిగ్ధం నెలకొన్న వేళ.. ఆసక్తికరమైన ప్రకటన చేసింది యూఏఈ. ఈ ఏడాది టోర్నీని తాము నిర్వహిస్తామని ముందుకొచ్చింది. దీనిపై బీసీసీఐ స్పందించలేదు. అక్టోబర్​లో జరగాల్సిన టీ20 వరల్డ్​కప్​ రద్దయితే ఆ స్థానంలో ఈ మెగాటోర్నీ జరిగే అవకాశముంది.

లాక్​డౌన్​తో కుదేలైన ఆర్థిక రథం కదలాలంటే?

కరోనా సంక్షోభం ముంచుకురావడం వల్ల మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికకు విఘాతం ఏర్పడింది. బడ్జెట్​లో ప్రకటించిన వివిధ కార్యక్రమాలను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వం పేరుకు రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించినా, వాస్తవ కేటాయింపులు జీడీపీలో రెండు శాతాన్ని మించవని కొందరు నిపుణుల అంచనా. అయితే వ్యవసాయ సంస్కరణలు, బొగ్గు రవాణాపై పెట్టుబడులు, ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రయోజనాలు ఈ ప్యాకేజీలో చెప్పుకోదగిన అంశాలు.

దేశంలో కరోనా రికార్డ్: 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయంటే..

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,971 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 287 మంది మరణించారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. కొవిడ్​-19 కేసులపరంగా భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసా..

లైవ్​ వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య

ఎనిమిది మంది దుండగులు ఓ యువ వ్యాపారవేత్తను పట్టపగలే కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు ఎక్కడ జరిగిందంటే..

'గ్యాస్​ లీక్' కలకలం

ముంబయిలో గ్యాస్​ లీక్​ అంటూ కలకలం రేగింది. తెల్లవారుజామునే పలు ఫోన్లు రావటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో తనిఖీ చేసి ఈ వార్తలు అవాస్తవమని తెలిపారు అధికారులు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, అసత్య వార్తలు నమ్మవద్దని సూచించారు.

పురిటినొప్పులతో విలవిల్లాడింది.. బావిలో పడి చనిపోయింది..

చిన్నప్ప... సన్నకారు రైతు. పాడితో అంతో ఇంతో ఆదాయం వస్తుందని ఓ ఆవును పోషిస్తున్నాడు. ఇటీవల అది చూడికి వచ్చింది. అప్పటి నుంచి మరింత శ్రద్ధ చూపుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. చెంగుచెంగున పరుగులెత్తే లేగదూడ తన ఇంటికి వస్తుందని మురిసిపోయాడు. కానీ అంతలో

తెలుగు రాష్ట్రాల 15 ప్రాజెక్టులపై ఆరా

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ప్రాజెక్టుల పూర్తి వివరాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు నుంచి కేంద్రం తీసుకున్నట్లు తెలిసింది. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సూచన మేరకు 2 రాష్ట్రాలకు సంబంధించిన 15 ప్రాజెక్టుల వివరాలను బోర్డు అధికారులు పంపినట్లు సమాచారం.

జనావాసాల్లోకి చిరుతల రాకుండా ఇలా చేస్తాం.!

అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి జంతువుల కదలికలను నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి తెలిపారు. పరిహారం ఎందుకు ఇస్తామన్నారు.. ?

అడుగడుగునా తనిఖీలు..

తిరుమలలో స్వామి వారి దర్శనాలు పున:ప్రారంభమవుతున్నందున తితిదే పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అలిపిరి నుంచి ఆనంద నిలయం వరకూ అడుగడుగునా తనిఖీలు నిర్వహించనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను బుక్‌ చేసుకుని వస్తే మంచిదని ఎవరన్నారు.

సన్నీ ప్రేమ కహానీ.. మీటుతుంది మీ హృదయాన్ని

జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ హాట్ గర్ల్ సన్నీ లియోనీ. తన లవ్​లైఫ్​ కూడా అంత సాఫీగా సాగలేదు. ఈ భామ ప్రేమ కహానీపై ఫూర్తి కథనం మీకోసం.

'అవకాశం ఇస్తే.. ఐపీఎల్​ నిర్వహణకు మేము రెడీ'

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్​-2020పై సందిగ్ధం నెలకొన్న వేళ.. ఆసక్తికరమైన ప్రకటన చేసింది యూఏఈ. ఈ ఏడాది టోర్నీని తాము నిర్వహిస్తామని ముందుకొచ్చింది. దీనిపై బీసీసీఐ స్పందించలేదు. అక్టోబర్​లో జరగాల్సిన టీ20 వరల్డ్​కప్​ రద్దయితే ఆ స్థానంలో ఈ మెగాటోర్నీ జరిగే అవకాశముంది.

లాక్​డౌన్​తో కుదేలైన ఆర్థిక రథం కదలాలంటే?

కరోనా సంక్షోభం ముంచుకురావడం వల్ల మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికకు విఘాతం ఏర్పడింది. బడ్జెట్​లో ప్రకటించిన వివిధ కార్యక్రమాలను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వం పేరుకు రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించినా, వాస్తవ కేటాయింపులు జీడీపీలో రెండు శాతాన్ని మించవని కొందరు నిపుణుల అంచనా. అయితే వ్యవసాయ సంస్కరణలు, బొగ్గు రవాణాపై పెట్టుబడులు, ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రయోజనాలు ఈ ప్యాకేజీలో చెప్పుకోదగిన అంశాలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.