మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరేడ్మెట్ పీఎస్ పరిధిలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచిన గోడౌన్పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి... భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. వీటి విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. వినాయకనగర్కు చెందిన నిరంజన్ అనే వ్యక్తి కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడిపిస్తున్నాడని పేర్కొన్నారు.
అక్రమ సంపాదనకు అలవాటు పడిన అతను కిరాణ దుకాణం ముసుగులో ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నాడని చెప్పారు. ఇదివరకే ఎన్నోసార్లు ఇటువంటి కేసులో ఎస్ఓటీ పోలీసులకు చిక్కినా బుద్ధి మారలేదని పోలీసులు అన్నారు.
ఇదీ చూడండి : ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..